News March 6, 2025

మార్చి 7 నుంచి ప్రయోగ తరగతులు.

image

మహబూబ్ నగర్ MVS కళాశాలలోని డా.బి.ఆర్ అంబేద్కర్ సార్వత్రిక విశ్వవిద్యాలయంలో డిగ్రీ 3వ ఏడాది సైన్స్ విద్యార్థులకు సెమిస్టర్‌ 5 ప్రయోగ తరగతులు మార్చి 7వ తేదీ నుంచి ప్రారంభం కానున్నాయన్నాయి. ఈ ప్రయోగ తరగతులకు ఉమ్మడి మహబూబ్ నగర్ జిల్లాలోని అన్ని స్టడీ సెంటర్ల విద్యార్థులు హాజరు కావాలని, 80% హాజరు లేని వారిని ప్రయోగ పరీక్షలకు అనుమతించరని రీజినల్ కోఆర్డినేటర్ డాక్టర్ జి. సత్యనారాయణ గౌడ్ తెలిపారు.

Similar News

News December 5, 2025

ఆయుష్మాన్ భారత్ పథకంలో మధుమేహ రోగులను చేర్చాలి: ఎంపీ

image

ఆయుష్మాన్ భారత్ పథకంలో టైప్-1 మధుమేహం రోగులను, అవుట్ పేషెంట్ సేవలు కూడా చేర్చాలని ఎంపీ శ్రీ భరత్ పార్లమెంట్‌ సమావేశాల్లో కోరారు. ఇన్సులిన్, గ్లూకోజ్ లాంటి ముఖ్య ఔషధాలు ప్రజారోగ్య సంస్థల్లో నిరంతరాయంగా అందుబాటులో ఉండేలా చర్యలు తీసుకోవాలని కోరారు. ఇన్సులిన్ ఒక మందు మాత్రమే కాదని, జీవనాధారమన్నారు. వీటి లభ్యత, ధరల సమస్య కారణంగా ఎవరూ ప్రాణం కోల్పోకూడదని, ఈ విషయంలో కేంద్రం తక్షణమే స్పందించాలన్నారు.

News December 5, 2025

విశాఖ: పాఠశాలలో బాలికల వాష్‌రూమ్ వద్ద యువకుడి వెకిలి చేష్టలు

image

చంద్రంపాలెం ఉన్నత పాఠశాలలో మెగా పేరెంట్ టీచర్స్ మీటింగ్ జరుగుతున్న సమయంలో ఓ అపరిచిత వ్యక్తి అనుమానాస్పదంగా వ్యవహరించాడు. పాఠశాలలోకి ప్రవేశించిన యువకుడు బాలికల వాష్‌రూమ్ వద్ద వెకిలి చేష్టలకు పాల్పడుతుండటాన్ని విద్యార్థినులు గమనించారు. వెంటనే వారు ప్రధానోపాధ్యాయులు ములుగు వెంకటరావుకు సమాచారం అందించారు. ప్రధానోపాధ్యాయుడు తక్షణమే పీఎంపాలెం పోలీసులకు ఫిర్యాదు చేయగా పోలీసులు అదుపులోకి తీసుకున్నారు.

News December 5, 2025

‘కృష్ణాస్ఫూర్తి’ పేరుతో విజయగాధలను ప్రసారం చేయండి: కలెక్టర్

image

వివిధ ప్రభుత్వ రాయితీలు వినియోగించుకుని విజయవంతమైన వారి స్ఫూర్తిదాయక విజయగాధలు తయారు చేసి ప్రసార మాధ్యమాల ద్వారా ప్రచారం చేయాలని కలెక్టర్ డీకే బాలాజీ అధికారులను ఆదేశించారు. శుక్రవారం తన క్యాంపు ఆఫీస్‌లో అధికారులతో ఆయన సమావేశమయ్యీరు. ప్రభుత్వ రాయితీలు, బ్యాంకు రుణాలను పొంది విజయవంతమైన వ్యక్తులు లేదా ప్రాజెక్టుల కథలను ‘కృష్ణాస్ఫూర్తి’ పేరుతో ప్రతి రోజు వాటిని ప్రసారం చేయాలన్నారు.