News January 4, 2025

మార్చి 8న జాతీయ లోక్ అదాలత్: జిల్లా జడ్జి

image

మార్చి 8న జరగబోయే జాతీయ లోక్ అదాలత్ కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని జిల్లా ప్రధాన న్యాయమూర్తి సాయి కళ్యాణ్ చక్రవర్తి పిలుపునిచ్చారు. శుక్రవారం తన ఛాంబర్ లోని పలు ప్రైవేట్ చిట్ ఫండ్ ఫైనాన్స్ కంపెనీల ప్రతినిధులతో సమావేశం నిర్వహించారు. ఫైనాన్స్ కంపెనీకి చెందిన కేసులన్నీ లోక్ అదాలత్ లో పరిష్కరించుకోవాలని సూచించారు. ఎక్కువ కేసులు రాజీ చేసుకునే ప్రయత్నం చేయాలన్నారు.

Similar News

News January 25, 2025

VZM: అవార్డు అందుకున్న కలెక్టర్ అంబేడ్కర్

image

ఉత్తమ జిల్లా ఎన్నికల అధికారిగా కలెక్టర్ డాక్టర్‌‌.బీఆర్ అంబేడ్కర్ విజయవాడలో శనివారం అవార్డు స్వీకరించారు. ఎన్నికల సంఘం ఆధ్వర్యంలో విజయవాడ తుమ్మలపల్లి కళా క్షేత్రంలో నిర్వహించిన జాతీయ ఓటర్ల దినోత్సవ వేడుకల్లో రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి కె.విజయానంద్ చేతుల మీదుగా కలెక్టర్ అవార్డు స్వీకరించారు.

News January 25, 2025

VZM: కలెక్టరేట్‌లో నేడు జాతీయ ఓటర్ల దినోత్సవం

image

15వ జాతీయ ఓటర్ల దినోత్సవ వేడుకలు విజయనగరం కలెక్టరేట్‌లో శనివారం జరగనున్నాయి. ఉదయం 10-30 గంటలకు కలెక్టర్ కార్యాలయ ఆడిటోరియంలో ఘనంగా జరుగుతాయని కలెక్టర్ డాక్టర్ బీఆర్ అంబేడ్కర్ తెలిపారు. ఈ కార్యక్రమానికి జిల్లా ప్రధాన న్యాయమూర్తి బి. సాయి కల్యాణ్ చక్రవర్తి ముఖ్య అతిథిగా హాజరు కానున్నారన్నారు.

News January 24, 2025

విశాఖలో విజయనగరం విద్యార్థి మృతి

image

విజయనగరం జిల్లా యువకుడు గంభీరం డ్యామ్‌లో మృతి చెందాడు. గరివిడి మండలం కందిపేటకు చెందిన మీసాల నాని విశాఖలో బీటెక్ చదువుతున్నాడు. శుక్రవారం ఆనందపురం మండలం గంభీరం డ్యామ్‌‌లో ఈతకు వెళ్లి విద్యార్థి మృతి చెందాడు. ఈ ఘటనపై పోలీసులు దర్యాప్తు చేపట్టారు.