News February 2, 2025
మార్చి 8 వరకు పీజీఆర్ఎస్ రద్దు: కలెక్టర్
శ్రీకాకుళం, విజయనగరం విశాఖపట్నం ఉపాధ్యాయుల నియోజకవర్గం ఎన్నికల నేపథ్యంలో జనవరి 29నుంచి మార్చ్ 8వరకు ప్రజా సమస్యల పరిష్కార వేదిక రద్దు చేయడం జరిగిందని కలెక్టర్ శనివారం తెలిపారు. ఈ విషయమై విశాఖ జిల్లాలో అన్ని ప్రభుత్వం కార్యాలయలలో జరిగే పీజీఆర్ఎస్ రద్దు చేస్తున్నట్లు పేర్కొన్నారు. నగర ప్రజలు ఈ విషయం గమనించాలన్నారు.
Similar News
News February 2, 2025
గాజువాకలో యువకుడి సూసైడ్
గాజువాకలో విజయనగరం యువకుడు ఆత్మహత్య చేసుకున్న సంఘటన వెలుగులోకి వచ్చింది. ఫార్మాసిటీలో పనిచేస్తున్న భాస్కరరావు శ్రీనగర్లో అద్దెకు ఉంటున్నాడు. పక్కింట్లో ఉన్న అమ్మాయి స్నానం చేస్తుండగా వీడియో తీశాడని ఆమె బందువులు దాడి చేసి ఇంట్లో బంధించారు. దీంతో మనస్తాపానికి గురైన యువకుడు శనివారం ఆత్మహత్య చేసుకున్నాడు. కొట్టి చంపారని యువకుడి తల్లిదండ్రుల ఫిర్యాదుతో గాజువాక పోలీసులు ఐదుగురిని అదుపులోకి తీసుకున్నారు.
News February 2, 2025
శొంఠ్యాం హైవేపై యాక్సిడెంట్.. ఒకరు మృతి
ఆనందపురం మండలం శొంఠ్యాం హైవే వద్ద ఆదివారం ఉదయం రోడ్డు ప్రమాదం జరిగింది. పెందుర్తి నుంచి ఆనందపురం వైపు వస్తున్న బైక్ లారీని ఢీకొట్టడంతో యువకుడు అక్కడికక్కడే మృతిచెందినట్లు స్థానికులు తెలిపారు. పోలీసులకు, అంబులెన్స్కు సమాచారం అందించారు. మరిన్ని వివరాలు తెలియాల్సి ఉంది.
News February 2, 2025
విశాఖ: క్రికెట్ బెట్టింగ్ ప్రధాన నిందితుడు అరెస్ట్
విశాఖ సీపీ ఆదేశాలు మేరకు పెద్దవాల్తేర్లో శనివారం టాస్క్ ఫోర్స్, సైబర్ క్రైమ్ పోలీసులు రైడ్ నిర్వహించారు. ఆన్లైన్ క్రికెట్ బెట్టింగ్ ముఠాలో ప్రధాన నిందితుని అరెస్ట్ చేసి రిమాండుకు తరలించారు. ఈ ముద్దాయి ద్వారా బెట్టింగ్ బుకీల సమాచారం వెలుగులోకి వచ్చిందన్నారు. త్వరలో వారిని పట్టుకుని అరెస్ట్ చేస్తామని తెలిపారు. ఈ బెట్టింగ్ ద్వారా 178 కోట్ల లావాదేవీలు జరిగినట్లు గుర్తించారు.