News February 2, 2025
మార్చి 8 వరకు పీజీఆర్ఎస్ రద్దు: కలెక్టర్

శ్రీకాకుళం, విజయనగరం విశాఖపట్నం ఉపాధ్యాయుల నియోజకవర్గం ఎన్నికల నేపథ్యంలో జనవరి 29నుంచి మార్చ్ 8వరకు ప్రజా సమస్యల పరిష్కార వేదిక రద్దు చేయడం జరిగిందని కలెక్టర్ శనివారం తెలిపారు. ఈ విషయమై విశాఖ జిల్లాలో అన్ని ప్రభుత్వం కార్యాలయలలో జరిగే పీజీఆర్ఎస్ రద్దు చేస్తున్నట్లు పేర్కొన్నారు. నగర ప్రజలు ఈ విషయం గమనించాలన్నారు.
Similar News
News November 18, 2025
పద్మనాభం దీపోత్సవానికి సర్వం సిద్ధం..

భారతదేశంలోనే 2వ అనంత పద్మనాభ స్వామి ఆలయంలో (పద్మనాభం మండలం) ఈనెల 19న కార్తీక దీపోత్సవం జరగనుంది. ఎమ్మెల్యే గంటా శ్రీనివాసరావు పర్యవేక్షణలో అన్ని ఏర్పాట్లు పూర్తయ్యాయి. ట్రాఫిక్ నియంత్రణ, అదనపు బస్సులు, వైద్య శిబిరాలు ఏర్పాటు చేశారు. ఈసారి ఘాట్ రోడ్డు అందుబాటులోకి రావడంతో ఎక్కువ మంది భక్తులు వస్తారని అంచనా. భక్తుల కోసం మెట్ల మార్గంలో అన్ని సౌకర్యాలు కల్పించారు.
News November 18, 2025
పద్మనాభం దీపోత్సవానికి సర్వం సిద్ధం..

భారతదేశంలోనే 2వ అనంత పద్మనాభ స్వామి ఆలయంలో (పద్మనాభం మండలం) ఈనెల 19న కార్తీక దీపోత్సవం జరగనుంది. ఎమ్మెల్యే గంటా శ్రీనివాసరావు పర్యవేక్షణలో అన్ని ఏర్పాట్లు పూర్తయ్యాయి. ట్రాఫిక్ నియంత్రణ, అదనపు బస్సులు, వైద్య శిబిరాలు ఏర్పాటు చేశారు. ఈసారి ఘాట్ రోడ్డు అందుబాటులోకి రావడంతో ఎక్కువ మంది భక్తులు వస్తారని అంచనా. భక్తుల కోసం మెట్ల మార్గంలో అన్ని సౌకర్యాలు కల్పించారు.
News November 18, 2025
సింహాచలం: తోటలో చిరు వ్యాపారి ఆత్మహత్య

అప్పులు బాధ తట్టుకోలేక చిరు వ్యాపారి ఆత్మహత్య చేసుకున్నాడు. ఈ ఘటన సోమవారం జరిగింది. ఆరిలోవ ప్రాంతానికి చెందిన జరజాపు వెంకట అజయ్ కుమార్ వ్యాపారం చేసుకుని బతుకుతున్నారు. అప్పులు ఎక్కువ కావడంతో సింహాచలం సమీపంలోని లండగరువు తోటలో ఉరి వేసుకుని ఆత్మహత్య చేసుకున్నాడు. గోపాలపట్నం సీఐ ఎల్.సన్యాసినాయుడు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు.


