News March 18, 2025

మార్టూరులో రోడ్డు ప్రమాదం.. వ్యక్తి మృతి

image

మార్టూరు జాతీయ రహదారిపై మంగళవారం రోడ్డు ప్రమాదం చోటుచేసుకుంది. స్థానికులు తెలిపిన వివరాల మేరకు.. ఒంగోలు వైపు నుంచి గుంటూరు వైపు వెళుతున్న ఓ కారు టైరు పగిలి డివైడర్‌ను బలంగా ఢీ కొట్టింది. ఈ ప్రమాదంలో కారులో ప్రయాణిస్తున్న నలుగురికి గాయాలయ్యాయి. వారిని ఆసుపత్రికి తరలించగా చికిత్స పొందుతూ ఒకరు చనిపోయారు. మరో ముగ్గురుకి చికిత్స అందిస్తున్నారు. ఈ ఘటనకు సంబంధించి పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.

Similar News

News December 2, 2025

తిరుపతి: కోనలో ఇరుక్కుపోయిన భక్తులు

image

తిరుపతి జిల్లా ఏర్పేడు మండలంలోని బత్తినయ్య కోనకు వెళ్లిన కొందరు భక్తులు చిక్కుకుపోయారు. బత్తినయ్య కోనలోని భక్తకంటేశ్వర స్వామి దర్శనానికి సోమవారం భక్తులు వెళ్లారు. ఇవాళ ఉదయం తిరుగు ప్రయాణమయ్యారు. భారీ వర్షాలతో కోనకు సమీపంలోని వాగుకు వరద పోటెత్తింది. అటవీ ప్రాంతం నుంచి వేరే దారి ఉన్నప్పటికీ స్థానికేతరులు కావడంతో చిక్కుకుపోయారు. ట్రాక్టర్, రోప్ తీసుకుని ఏర్పేడు అధికారులు ఘటన స్థలానికి బయల్దేరారు.

News December 2, 2025

ఏయూలో స్పెషల్ డ్రైవ్ పరీక్షలకు నోటిఫికేషన్

image

ఏయూలో స్పెష‌ల్ డ్రైవ్ ప‌రీక్ష‌ల‌కు కంట్రోల‌ర్ ఆఫ్ ఎగ్జామినేష‌న్స్ అధికారి టి.చిట్టిబాబు నోటిఫికేష‌న్‌‌ విడుద‌ల చేశారు. 2010-11 సంవ‌త్స‌రం నుంచి 2025 వ‌ర‌కు డిగ్రీ, పీజీ ప్ర‌వేశం పొందిన విద్యార్థులు స్పెష‌ల్ డ్రైవ్ ప‌రీక్ష‌ల‌కు అర్హులుగా ఆయన పేర్కొన్నారు. డిసెంబ‌ర్ 4 నుంచి 26వ తేదీ వ‌ర‌కు ద‌ర‌ఖాస్తు చేసుకోవాలి. ఫిబ్ర‌వ‌రి 20వ తేదీ నుంచి ప‌రీక్ష‌లు నిర్వ‌హించేందుకు ప్ర‌ణాళిక సిద్ధం చేస్తున్నారు.

News December 2, 2025

భూపాలపల్లి: కాంగ్రెస్ సారథికి సవాల్!

image

కాంగ్రెస్ జిల్లా అధ్యక్షుడు బట్టు కర్ణాకర్‌కు పంచాయతీ ఎన్నికలు సవాలుగా మారనున్నాయి. జిల్లా కాంగ్రెస్‌లో ఉన్న అంతర్గత లుకలుకల నేపథ్యంలో, అన్ని వర్గాలను కలుపుకుపోవడం ఆయనకు కత్తిమీద సాములా మారింది. సీనియర్ నాయకులతో సమన్వయం సాధించడంపైనే ఆయన దృష్టి సారించాల్సి ఉంటుంది.