News March 19, 2025

మార్టూరులో రోడ్డు ప్రమాదం.. వ్యక్తి మృతి

image

మార్టూరు జాతీయ రహదారిపై మంగళవారం రోడ్డు ప్రమాదం చోటుచేసుకుంది. స్థానికులు తెలిపిన వివరాల మేరకు.. ఒంగోలు వైపు నుంచి గుంటూరు వైపు వెళుతున్న ఓ కారు టైరు పగిలి డివైడర్‌ను బలంగా ఢీ కొట్టింది. ఈ ప్రమాదంలో కారులో ప్రయాణిస్తున్న నలుగురికి గాయాలయ్యాయి. వారిని ఆసుపత్రికి తరలించగా చికిత్స పొందుతూ ఒకరు చనిపోయారు. మరో ముగ్గురుకి చికిత్స అందిస్తున్నారు. ఈ ఘటనకు సంబంధించి పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.

Similar News

News April 19, 2025

నాగర్‌కర్నూల్: ‘ప్రభుత్వ కొనుగోలు కేంద్రాలు వెంటనే ఏర్పాటు చేయాలి’

image

నాగర్‌కర్నూల్ జిల్లా కేంద్రంలోని తెలంగాణ రైతు సంఘం కార్యాలయంలో శుక్రవారం రైతు సంఘం జిల్లా నాయకుల సమావేశం జరిగింది. ఈ సమావేశంలో ఆ సంఘం జిల్లా ప్రధాన కార్యదర్శి శ్రీనివాసులు మాట్లాడారు. వరి కోతలు ప్రారంభమై పది రోజులు దాటినా జిల్లాలో ఇంకా వడ్ల కొనుగోలు కేంద్రాలు ప్రభుత్వం ఏర్పాటు చేయలేదని, వెంటనే ఏర్పాటు చేయాలని డిమాండ్ చేశారు. కార్యక్రమంలో జిల్లా అధ్యక్షుడు సి.బాల్‌రెడ్డి తదితరులు పాల్గొన్నారు.

News April 19, 2025

విజయవాడలో రోడ్డు ప్రమాదం (UPDATE)

image

విజయవాడ గన్నవరం జాతీయ రహదారిపై శుక్రవారం రోడ్డు ప్రమాదం జరిగిన విషయం తెలిసిందే. గన్నవరం నుంచి విజయవాడ వైపు వెళుతున్న లారీ డ్రైవర్‌కు ప్రసాదంపాడు వద్ద గుండెపోటు రావడంతో డ్రైవర్ రామకృష్ణ అక్కడికక్కడే మరణించాడు. ఫుట్ పాత్‌పై లారీ దూసుకెళ్లడంతో నడుచుకొని వెళ్తున్న రామసాయి(18) స్పాట్‌లోనే మృతి చెందాడు. మరో ఇద్దరికి గాయాలైనట్లు పోలీసులు తెలిపారు. లారీ డ్రైవర్ పామర్రుకు చెందిన  వ్యక్తిగా గుర్తించారు.

News April 19, 2025

నేటి నుంచి GMAT స్పెషల్ క్లాసులు

image

TG: గ్రాడ్యుయేట్ మేనేజ్‌మెంట్ అడ్మిషన్ టెస్ట్(GMAT) వచ్చే నెలలో జరగనుంది. పరీక్ష రాసే అభ్యర్థుల్లో నైపుణ్యాలను పెంచేందుకు నేటి నుంచి స్పెషల్ క్లాసులు నిర్వహించనున్నట్లు టీశాట్ CEO వేణుగోపాల్ రెడ్డి తెలిపారు. రోజూ ఉ.8-8.30 వరకు నిపుణ ఛానల్‌లో, సాయంత్రం 6-6.30 వరకు విద్య ఛానల్లో క్లాసులు ప్రసారం చేస్తామని వెల్లడించారు. APRIL 22న ‘వరల్డ్ ఎర్త్ డే’ సందర్భంగా ఉ.11కు ప్రత్యేక లైవ్ పోగ్రామ్ ఉంటుందన్నారు.

error: Content is protected !!