News January 23, 2025
మార్టూరులో సినిమా స్టైల్లో దొంగతనం

మార్టూరులో సినిమా స్టైల్ లో బుధవారం దొంగతనం జరిగింది. బల్లికురవ మండలానికి చెందిన ఓ వ్యక్తి మార్టూరులోని ఒక ప్రైవేట్ ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న అతని సన్నిహితుడిని చూడటానికి వచ్చాడు. కారును రోడ్డు పక్కన ఉంచి ఆసుపత్రిలోకి వెళ్లాడు. అదును చూసిన దొంగలు తిరిగొచ్చేసరికి కారు అద్దం పగల కొట్టి అందులోని రూ.1.2 లక్షల నగదు, ల్యాప్టాప్, చెక్కు బుక్ను ఎత్తుకెళ్లారు. దీనిపై పోలీసులు కేసు నమోదు చేశారు.
Similar News
News February 16, 2025
ప్రకాశం: నిర్లక్ష్యానికి ముగ్గురు బలి

పల్నాడు జిల్లా నెమలిపురి దగ్గర అద్దంకి-నార్కెట్ పల్లి హైవేపై జరిగిన రోడ్డు ప్రమాదంలో ముగ్గురు ప్రకాశం జిల్లా వాసులు మృతిచెందిన విషయం తెసిందే. హైదరాబాద్ నుంచి మద్దిపాడుకు వస్తుండగా లారీ, కారును ఢీకొట్టింది. తల్లి, ఇద్దరు కుమారులు మృతిచెందారు. ఎస్పీ శ్రీనివాసరావు ఘటనా స్థలానికి చేరుకొని పరిశీలించారు.
ప్రమాదానికి లారీ డ్రైవర్ నిర్లక్ష్యమే కారణమని ప్రాథమికంగా నిర్ధారించారు.
News February 16, 2025
ప్రకాశం: ఘోర రోడ్డు ప్రమాదం.. ముగ్గురి మృతి

పల్నాడు జిల్లా రాజుపాలెం(M) నెమలిపురి దగ్గర అద్దంకి- నార్కెట్ పల్లి హైవేపై ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. హైదరాబాద్ నుంచి ప్రకాశం జిల్లా మద్దిపాడు వెళుతున్న కారును లారీ ఢీ కొట్టింది. ఈ ప్రమాదంలో ఒకే కుటుంబానికి చెందిన తల్లి, ఇద్దరు కొడుకులు అక్కడికక్కడే మృతి చెందారు. మృతులు ప్రకాశం జిల్లాకు చెందిన షేక్ నజీమా, నూరుల్లా, హబీబుల్లాగా గుర్తించారు. పూర్తి సమాచారం తెలియాల్సి ఉంది.
News February 16, 2025
ఒంగోలు: ‘దివ్యాంగుల అర్జీలను సత్వరమే పరిష్కరించాలి’

దివ్యాంగుల సమస్యలను పరిష్కరించడంలో ఎలాంటి నిర్లక్ష్యం చేయరాదని కలెక్టర్ తమీమ్ అన్సారియా స్పష్టం చేశారు. దివ్యాంగుల సమస్యల పరిష్కారం కోసం శనివారం ప్రకాశం భవనంలో ప్రత్యేక గ్రీవెన్స్ కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ.. సుమారు 60 మంది దివ్యాంగులు వారి సమస్యలపై అర్జీలను సమర్పించినట్లు చెప్పారు. సత్వరమే ఈ అర్జీలను పరిష్కరించాలని అధికారులను ఆమె ఆదేశించారు.