News July 16, 2024
మార్టూరు: రాజుపాలెంలో కత్తితో దాడి

మార్టూరు మండలంలోని రాజుపాలెంలో ఓ వ్యక్తి కత్తి దాడికి గురై తీవ్రంగా గాయపడిన ఘటన చోటుచేసుకుంది. స్థానికుల వివరాల ప్రకారం.. గ్రామంలోని తూర్పు కాలనీలో జె. నాగేంద్రబాబు, జె. చిన నాగరాజు మధ్య రేగిన వివాదంలో జె. శ్రీనివాసరావు వారిని విడదీసేందుకు వెళ్లాడు. ఆ సమయంలో నాగరాజు కత్తితో శ్రీనివాసరావుపై దాడి చేయడంతో ఎడమ చేతికి గాయమైనట్లు వెల్లడించారు. క్షతగాత్రుడిని స్థానిక ఆసుపత్రికి తరలించారు.
Similar News
News November 27, 2025
ప్రకాశం: నకిలీ బంగారంతో కేటుగాళ్ల బురిడీ

త్రిపురాంతకంలోని ఓ జ్యువెలర్స్ షాప్లో ఇద్దరు కేటుగాళ్లు నకిలీ బంగారం పెట్టి యజమానిని బురిడీ కొట్టించారు. 28 గ్రాముల నకిలీ బంగారాన్ని తనఖా పెట్టి రూ.1.50లక్షలను తీసుకుని అక్కడి నుంచి ఉడాయించారు. తాను మోసపోయినట్లు గ్రహించిన షాపు యజమాని పోలీసులకు ఫిర్యాదు చేశాడు. కేసు నమోదు చేసిన పోలీసులు సీసీ టీవీ ఫుటేజ్ ఆధారంగా నిందితుల కోసం గాలింపు చర్యటు చేపట్టారు.
News November 26, 2025
29న ఒంగోలులో విభిన్న ప్రతిభావంతులకు క్రీడా పోటీలు

ఒంగోలులోని డీఆర్ఆర్ఎం హై స్కూల్లో ఈనెల 29న అంతర్జాతీయ విభిన్న ప్రతిభావంతుల దినోత్సవ వేడుకల సందర్భంగా దివ్యాంగుల కోసం ప్రత్యేక క్రీడా పోటీలు నిర్వహించనున్నట్లు విభిన్న ప్రతిభావంతుల సహాయ సంచాలకులు సువార్త తెలిపారు. ఒంగోలులోని తన కార్యాలయంలో బుధవారం ఆమె మాట్లాడారు. విభిన్న ప్రతిభావంతులను క్రీడా పోటీలలో సైతం ప్రోత్సహించేందుకు ఈ పోటీలు నిర్వహిస్తున్నట్లు తెలిపారు. దివ్యాంగులు పాల్గొనాలని కోరారు.
News November 26, 2025
29న ఒంగోలులో విభిన్న ప్రతిభావంతులకు క్రీడా పోటీలు

ఒంగోలులోని డీఆర్ఆర్ఎం హై స్కూల్లో ఈనెల 29న అంతర్జాతీయ విభిన్న ప్రతిభావంతుల దినోత్సవ వేడుకల సందర్భంగా దివ్యాంగుల కోసం ప్రత్యేక క్రీడా పోటీలు నిర్వహించనున్నట్లు విభిన్న ప్రతిభావంతుల సహాయ సంచాలకులు సువార్త తెలిపారు. ఒంగోలులోని తన కార్యాలయంలో బుధవారం ఆమె మాట్లాడారు. విభిన్న ప్రతిభావంతులను క్రీడా పోటీలలో సైతం ప్రోత్సహించేందుకు ఈ పోటీలు నిర్వహిస్తున్నట్లు తెలిపారు. దివ్యాంగులు పాల్గొనాలని కోరారు.


