News January 24, 2025
మాసాయిపేట: భార్య దూరంగా ఉంటుందని ఆత్మహత్య

అర్ధరాత్రి ఇంటి నుంచి వెళ్లిన ఒక వ్యక్తి గ్రామ శివారులో చెరువులో దూకి ఆత్మహత్య చేసుకున్న ఘటన మాసాయిపేట మండలంలో చోటుచేసుకుంది. పోలీసుల వివరాలు.. చెట్ల తిమ్మాయిపల్లి గ్రామానికి చెందిన నర్సింహ చారి ఈనెల 21న అర్ధరాత్రి ఇంటి నుంచి వెళ్లిపోయాడు. గ్రామ శివారులో ఆత్మహత్య చేసుకున్నారు. అయితే భార్య గత కొంత కాలంగా దూరంగా ఉండడంతో మనస్తాపం చెంది ఆత్మహత్య చేసుకున్నట్లు బంధువులు ఫిర్యాదు చేశారు.
Similar News
News December 7, 2025
మెదక్: ఈ ఆదివారం విందులకు సై..

మెదక్ జిల్లాలో స్థానిక సంస్థల ఎన్నికలకు నామినేషన్ల ప్రక్రియ ముగియడంతో ప్రచారం ఊపందుకుంది. అభ్యర్థులు ఓటర్లను ఆకర్షించేందుకు వివిధ ప్రయత్నాలు చేస్తున్నారు. ముఖ్యంగా యువతను ప్రసన్నం చేసుకునేందుకు, మొదటి రెండు విడతల ఎన్నికలను దృష్టిలో ఉంచుకుని, అభ్యర్థులు నేడు పెద్ద ఎత్తున విందులు ఏర్పాటు చేస్తున్నట్లు సమాచారం. దీంతో నేడు ఆదివారం అత్యంత కీలకంగా మారింది.
News December 7, 2025
ఏకగ్రీవ పంచాయతీల్లోనూ ఎన్నికల కోడ్: కలెక్టర్

మెదక్ జిల్లాలో జిల్లాలో గ్రామ పంచాయతీ ఎన్నికల ప్రక్రియ పూర్తయ్యే వరకు ఎన్నికల ప్రవర్తన నియమావళి(ఎన్నికల కోడ్) అమల్లోనే ఉంటుందని జిల్లా ఎన్నికల అధికారి, కలెక్టర్ రాహుల్ రాజ్ ప్రకటించారు. మూడు దశల్లో ఎన్నికలు జరుగుతున్నందున, చివరి దశ పూర్తయ్యే వరకూ కోడ్ కొనసాగుతుందని తెలిపారు. ఏకగ్రీవంగా నిలిచిన గ్రామపంచాయతీల్లోనూ ఎన్నికల కోడ్ యథాతథంగా అమల్లో ఉంటుందని కలెక్టర్ స్పష్టం చేశారు.
News December 7, 2025
తూప్రాన్: ‘కాళ్లు మొక్కుతా.. ఓటేసి మద్దతు ఇయ్యండి’

పంచాయతీ ఎన్నికల ప్రచారం జోరందుకుంది. కాళ్లు మొక్కుతా.. ఓటేసి మద్దతు ఇవ్వండి అంటూ ఓ అభ్యర్థి కాళ్లు పట్టి వేడుకున్నాడు. ఈ ఘటన శనివారం రాత్రి తూప్రాన్ ఐడీఓసీ భవనంలో గుర్తుల కేటాయింపు సమయంలో చోటుచేసుకుంది. ఇస్లాంపూర్(తూప్రాన్) సర్పంచ్ పదవికి బీఆర్ఎస్ మద్దతుతో పోటీ చేసిన సంతోష్ రెడ్డి కాంగ్రెస్లో చేరిపోయారు. బీఆర్ఎస్లో చేరిన స్వతంత్ర అభ్యర్ధి బీములు కాంగ్రెస్ నాయకుడి కాళ్లు పట్టుకొని వేడుకున్నాడు.


