News March 16, 2025

మాస్ కాపీయింగ్ ప్రోత్సహిస్తే కఠిన చర్యలు: కలెక్టర్

image

పదో తరగతి పరీక్షలు రేపటి నుంచి జరగనున్న నేపథ్యంలో అల్లూరి జిల్లా కలెక్టర్ దినేశ్ కుమార్ కాపీయింగ్‌ను ప్రోత్సహిస్తే చర్యలు తప్పవని వీసీలో హెచ్చరించారు. ఇన్విజిలేటర్లు మాస్ కాపీ లేకుండా చూడాలని, ఉత్తీర్ణత పెంచాలని కాపీయింగ్‌ను ప్రోత్సహిస్తే క్రిమినల్ కేసులు తప్పవన్నారు. జిల్లాలో 4,141 మంది 71 కేంద్రాల్లో పరీక్షలు రాయనున్నారు. వీటిలో 20 సమస్యాత్మక కేంద్రాలుగా గుర్తించారు.

Similar News

News November 14, 2025

‘జూబ్లీ’ రిజల్ట్స్: ఉదయం 8 గంటలకు కౌంటింగ్..

image

TG: జూబ్లీహిల్స్ ఉపఎన్నిక ఓట్ల లెక్కింపు ప్రక్రియ యూసుఫ్‌గూడలోని కోట్ల విజయభాస్కర్ రెడ్డి ఇండోర్ స్టేడియంలో జరగనుంది. ఉ.8గంటలకు పోస్టల్ బ్యాలెట్ల కౌంటింగ్ ప్రారంభం కానుంది. 58 మంది అభ్యర్థులు బరిలో ఉండటంతో లెక్కింపునకు 42 టేబుళ్లు ఏర్పాటు చేశారు. 10 రౌండ్లలో కౌంటింగ్ పూర్తి చేస్తామని, ఎప్పటికప్పుడు ఫలితాలను EC వైబ్‌సెట్‌లో అప్డేట్ చేస్తామని అధికారులు తెలిపారు. ఒక్కో రౌండ్‌కు 45 నిమిషాలు పట్టనుంది.

News November 14, 2025

మెదక్ జిల్లాలో కవిత పర్యటన

image

కవిత జాగృతి జనంబాట నేటి నుంచి మెదక్ జిల్లాలో ప్రారంభం కానుంది. నర్సాపూర్ నలంద స్కూల్లో చిల్డ్రన్స్ డే వేడుకల్లో పాల్గొంటారు. రెడ్డిపల్లిలో రీజనల్ రింగ్ రోడ్డు, కాల్వలు, హై టెన్షన్ లైన్ కోసం భూములు కోల్పోయిన బాధితులతో సమావేశం. పోతన్ శెట్టిపల్లిలో వివిధ పార్టీల నుంచి జాగృతి చేరికలు, ఘణపూర్ ఆనకట్ట సందర్శన, ఏడుపాయల వన దుర్గా అమ్మవారి దర్శనం, మెదక్ చర్చ్, పల్లికొట్టాల డబుల్ బెడ్ రూం సందర్శిస్తారు.

News November 14, 2025

వరంగల్: రైతులకు కొరకరాని కొయ్యగా మారిన కొత్త నిబంధనలు!

image

ఉమ్మడి వరంగల్ జిల్లాలో కేంద్ర ప్రభుత్వం తీసుకొచ్చిన కొత్త పత్తి కొనుగోలు నిబంధనలు రైతులను తీవ్ర ఇబ్బందులకు గురిచేస్తున్నాయి. సీసీఐ అధికారులు ఒక్కో రైతు ఒక ఎకరానికి కేవలం 7 క్వింటాళ్ల పత్తినే కొనుగోలు చేయాలని మార్గదర్శకాలు జారీ చేయడంతో ఎక్కువ దిగుబడి సాధించిన రైతులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. అలాగే, కపాస్ యాప్ ద్వారా మాత్రమే స్పాట్‌ బుకింగ్‌ చేయాలనే నియమం రైతుల ముందున్న మరో అడ్డంకిగా మారింది.