News August 8, 2024
మిడ్ మానేరుకు చేరిన 17.06 టీఎంసీల నీరు

రాజన్న సిరిసిల్ల జిల్లా బోయినపల్లి రాజరాజేశ్వర (మధ్యమానేరు) జలాశయంలో గురువారం నాటికి 17.06 టీఎంసీల నీరు చేరిందని ప్రాజెక్టు అధికారులు తెలిపారు. జలాశయానికి ఎల్లంపల్లి నుంచి నంది, గాయత్రి పంపు హౌజ్, వరద కాలువ ద్వారా 6,500 క్యూసెక్కులు, మానేరు, మూల వాగు నుంచి 200 క్యూసెక్కుల నీరు వచ్చి చేరుతోందని తెలిపారు. జలాశయం నుంచి అన్నపూర్ణ జలాశయానికి 6,462 క్యూసెక్కుల నీరు చేరినట్లు అధికారులు తెలిపారు .
Similar News
News April 11, 2026
KNR: మారిన అంగన్వాడీ కేంద్రాల పనివేళలు

వేసవి ఉష్ణోగ్రతలు పెరుగుతుండగా అంగన్వాడీ కేంద్రాల్లో చిన్నారులు ఉక్కపోతతో ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. ఇరుకైన భవనాల్లో గర్భిణులు, బాలింతలు, సిబ్బంది కూడా తీవ్రంగా ఇబ్బంది పడుతున్నారు. దీంతో ప్రభుత్వం ఒంటిపూట బడి అమలుచేసింది. కరీంనగర్ జిల్లాలో 777 కేంద్రాల్లో ఉదయం 8 నుంచి మధ్యాహ్నం 12.30 వరకు నిర్వహిస్తున్నారు. మే నెలలో పూర్తిస్థాయి వేసవి సెలవులు ప్రకటించడంతో చిన్నారులు, సిబ్బందికి ఉపశమనం లభించింది
News April 11, 2026
కరీంనగర్లో ఈనెల 16న జాబ్ మేళా

నిరుద్యోగ యువతకు ఉపాధి కల్పించేందుకు ఈనెల 16న కరీంనగర్ జిల్లా ఉపాధి కార్యాలయంలో జాబ్ మేళా నిర్వహిస్తున్నట్లు అధికారి తిరుపతిరావు తెలిపారు. పలు ప్రైవేట్ సంస్థల్లో 17 పోస్టులకు ఇంటర్వ్యూలు జరగనున్నాయి. డిగ్రీ ఉత్తీర్ణులై, 30 ఏళ్లలోపు ఉన్నవారు సర్టిఫికెట్లతో కాశ్మీర్గడ్డలోని కార్యాలయానికి హాజరుకావాలని కోరారు.
News April 10, 2026
హుజూరాబాద్: డంపింగ్ యార్డ్ రద్దు చేయాలని సీఎస్కు వినతి

హుజూరాబాద్ నియోజకవర్గ అభివృద్ధి, ప్రజల ఆరోగ్యం, పర్యావరణ పరిరక్షణకు సంబంధించిన డంపింగ్ యార్డ్ రద్దు చేయాలని ఎమ్మెల్యే పాడి కౌశిక్ రెడ్డి రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి రామకృష్ణారావును కలసి వినతి పత్రం సమర్పించారు. హుజూరాబాద్ మండలంలోని సిరిసపల్లిలో ఏర్పాటు చేయాలని ప్రతిపాదిస్తున్న డంపింగ్ యార్డ్పై ఎమ్మెల్యే కౌశిక్ రెడ్డి తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేశారు.


