News February 4, 2025
మిథిలాపురి: ఉరి వేసుకొని వ్యక్తి సూసైడ్

విశాఖలోని మిథిలాపురిలో ఓ వ్యక్తి ఉరివేసుకొని ఆత్మహత్య చేసుకున్నాడు. ఈ ఘటన మంగళవారం జరిగింది. మృతుడు విజయనగరం జిల్లా తెర్లాం మండలం పనుకువలస గ్రామానికి చెందిన అలుగుబెల్లి గణేశ్ (43)గా గుర్తించారు. విశాఖలో పెయింటర్గా పనిచేస్తున్న గణేశ్ మిథిలాపురిలోని ఉడాకాలనీలో 9 నెలలుగా ఉంటున్నాడు. కాగా మంగళవారం ఉదయం హాల్లో ఫ్యాన్కు ఉరివేసుకొని మృతిచెందినట్లు పీఎంపాలెం పోలీసులు తెలిపారు.
Similar News
News February 9, 2025
విశాఖ: ‘పైనుంచి మిమ్మల్ని చూస్తుంటా’

అగనంపూడి సమీపంలో రైలు కింద పడి <<15397134>>సూసైడ్ <<>>చేసుకున్న రాదేశ్(38) జేబులో లేఖ ఉన్నట్లు పోలీసులు గుర్తించారు. అందులో తన మృతికి ఎవరూ కారణం కాదని, అన్నయ్య పిల్లలు బాగా చదువుకోవాలని.. పైనుంచి మిమ్మల్ని చూస్తుంటానని రాసి ఉంది. కాగా.. ఉద్యోగం రాలేదన్న మనస్తాపంతో మృతి చెందినట్లు తెలుస్తోంది. మృతుడిది శ్రీహరిపురం కాగా.. ఫోను ఇంట్లోనే విడచిపెట్టి అగనంపూడి సమీపంలో రైలు కిందపడి సూసైడ్ చేసుకున్నాడు.
News February 9, 2025
విశాఖ: రీల్కు లైక్ కొట్టి రెండుసార్లు పెళ్లి.. కట్ చేస్తే..!

ఓ బాలిక ఇన్స్టాగ్రామ్లో చేసిన రీల్కు లైక్ కొట్టి ట్రాప్ చేసిన యువకుడిని విశాఖ పోలీసులు అరెస్టు చేశారు. తాటిచెట్లపాలెంకి చెందిన భార్గవ్ ఓ బాలిక చేసిన రీల్కు లైక్ కొట్టి ఫోన్ నంబర్ తీసుకున్నాడు. తనకూ రీల్స్ చేయాలని ఉందని కోఆపరేట్ చేయాలని కోరాడు. ఈ క్రమంలో ఆమెను రెండుసార్లు పెళ్లి చేసుకోగా విషయం బాలిక తల్లిదండ్రులకు తెలిసింది. వారి ఫిర్యాదు మేరకు భార్గవ్పై పోక్సో కేసు నమోదు చేసి అరెస్టు చేశారు.
News February 9, 2025
విశాఖ-ముంబై LTT రైలు రద్దు: డీసీఎం

విశాఖ నుంచి ముంబై వెళ్లే LTT రైలును(18519/20) ఫిబ్రవరి 10 నుంచి 20 వరకు రద్దు చేస్తున్నట్లు వాల్తేర్ డీసీఎం సందీప్ తెలిపారు. కాజీపేట్ డివిజన్లో ఇంటర్ లాకింగ్, నాన్ ఇంటర్ లాకింగ్ పనులు చేపట్టడం వలన రైలును రద్దు చేసినట్లు వెల్లడించారు. ముంబై నుంచి విశాఖ వచ్చే రైలు కూడా ఫిబ్రవరి 12 నుంచి 22వరకు రద్దు చేశామన్నారు. ప్రయాణికులు ఈ విషయాన్ని గమనించాలన్నారు.