News February 13, 2025
మినీ మేడారం జాతరకు ప్రత్యేక బస్సు

మేడారంలో జరిగే సమ్మక్క- సారలమ్మ మినీ మేడారం జాతరకు కొత్తగూడెం నుంచి బస్సు నడుపుతున్నట్లు ఖమ్మం జిల్లా రీజనల్ మేనేజర్ సరిరామ్ తెలిపారు. ఈ బస్సు కొత్తగూడెంలో ఉదయం 8 గంటలకు బయలుదేరి 12 గంటలకు మేడారం చేరుకుంటుందని, సాయంత్రం 4:30 గంటలకు మేడారంలో బయల్దేరి రాత్రి 8:30 గంటలకు కొత్తగూడెం చేరుకుంటుందని తెలిపారు. ఈ సౌకర్యాన్ని భక్తులు సద్వినియోగం చేసుకోవాలని కోరారు.
Similar News
News March 26, 2025
IPL: నేడు రాయల్స్తో రైడర్స్ ఢీ

ఐపీఎల్-2025లో భాగంగా ఇవాళ కోల్కతా నైట్ రైడర్స్, రాజస్థాన్ రాయల్స్ మధ్య మ్యాచ్ జరగనుంది. గువహటిలో రా.7.30కి మ్యాచ్ ప్రారంభమవుతుంది. టోర్నీ చరిత్రలో ఇప్పటివరకు ఇరు జట్లు 28 మ్యాచుల్లో తలపడగా, చెరో 14 విజయాలు సాధించాయి. ఈ సీజన్ను ఓటమితో ఆరంభించిన ఈ రెండు జట్లు ఇవాళ గెలిచి పాయింట్ల ఖాతా తెరవాలని చూస్తున్నాయి. ఈ మ్యాచులోనూ శాంసన్ ఇంపాక్ట్ ప్లేయర్గా ఆడే ఛాన్సుంది. ఇవాళ గెలిచేదెవరో కామెంట్ చేయండి.
News March 26, 2025
ఆళ్లగడ్డ: సమాజ సేవకుడిని మరో పురస్కారం

ఎటువంటి స్వార్థం లేకుండా సంపాదించిన సొమ్ములో సగానికి పైగా సమాజానికి ఖర్చు చేస్తున్న నిస్వార్థ సేవకుడు డాక్టర్ బిజ్జల నగేశ్ను మరో పురస్కారం వరించింది. సమాజ సేవను గుర్తించి తాజాగా పశ్చిమ బెంగాల్కు చెందిన వెల్ రెడ్ ఫౌండేషన్ సంస్థ ఉత్తమ సామాజిక కార్యకర్తగా గుర్తిస్తూ మహాత్మా గాంధీ నేషనల్ ఫ్రైడ్ అవార్డును అందించింది. దీంతో పాటు ప్రశంస పత్రాన్ని పంపుతూ అభినందనలు తెలిపింది.
News March 26, 2025
ఈనెల 28న ప.గో జిల్లాలో పవన్ పర్యటన

AP: డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ ఎల్లుండి పశ్చిమ గోదావరి జిల్లాలో పర్యటించనున్నారు. ఆ రోజున ఉదయం మొగల్తూరులో, సాయంత్రం పెనుగొండలో గ్రామ సభలు నిర్వహించనున్నారు. ఆయా గ్రామాలు, అన్ని శాఖల అధికారులతో సమావేశమై గ్రామాలకు కావాల్సిన మౌలిక వసతులు, అభివృద్ధి పనులపై చర్చిస్తారు. పవన్ కళ్యాణ్ కుటుంబ మూలాలు మొగల్తూరులో ఉన్న సంగతి తెలిసిందే.