News February 9, 2025

మినీ మేడారం జాతర మరో మూడు రోజులే!

image

ములుగు జిల్లా తాడ్వాయి మండలం మేడారం సమ్మక్క-సారలమ్మ మినీ జాతర మరో మూడు రోజుల్లో ప్రారంభం కానుంది. ఈ జాతరకు 20 లక్షల మందికి పైగా భక్తులు వచ్చి దర్శించుకుంటారని అధికారులు అంచనా వేస్తున్నారు. జాతరకు వచ్చే భక్తులకు జంపన్న వాగు వద్ద స్నానాలు ఆచరించడానికి షవర్లు, తాగునీటి సదుపాయం, పార్కింగ్ స్థలాలను ఇప్పటికే అధికారులు సిద్ధం చేశారు. బుధవారం నుంచి శనివారం వరకు మినీ జాతర జరగనుంది.

Similar News

News November 11, 2025

వీరు వేగంగా శ్రీవారి దర్శనం చేసుకోవచ్చు!

image

తిరుమల శ్రీవారి దర్శనానికి వెళ్లే భక్తులకు ఏడాదిలోపు పిల్లలు ఉంటే వేగంగా దర్శనం చేసుకోవచ్చు. సుపథం ప్రవేశ ద్వారం వద్ద ప్రత్యేక కౌంటర్ ఉంటుంది. దర్శన సమయం 12PM నుంచి సాయంత్రం 6 వరకు ఉంటుంది. దీనికి ముందస్తు ఆన్‌లైన్ బుకింగ్ అవసరం లేదు. నేరుగా సుపథం వద్దకు వెళ్లి పిల్లల జనన ధ్రువీకరణ పత్రం & తల్లిదండ్రుల ఆధార్ కార్డులు సమర్పిస్తే చాలు. వీరితోపాటు 12ఏళ్లలోపు తోబుట్టువును అనుమతిస్తారు. share it

News November 11, 2025

ఈనెల 14న పీయూలో రెజ్లింగ్ ఎంపికలు

image

పాలమూరు వర్సిటీ నుంచి సౌత్ జోన్ ఆలిండియా యూనివర్సిటీలో పాల్గొనేందుకు రెజ్లింగ్ ఎంపికలు నిర్వహిస్తున్నట్లు వర్సిటీ PD డా.వై. శ్రీనివాసులు ‘Way2News’తో తెలిపారు. ఈనెల 14న యోగ (స్త్రీ) జట్ల ఎంపికలు ఉంటాయని, వయస్సు 17-25లోగా ఉండాలన్నారు. ప్రస్తుతం చదువుతున్న బోనఫైడ్, టెన్త్ మెమోతోపాటు ఎలిజిబుల్ ఫామ్ తీసుకొని రావాలని, 13లోగా పేర్లు నమోదు చేసుకోవాలి, ప్రతి కళాశాల నుంచి ఐదుగురు పాల్గొనవచ్చని అన్నారు.

News November 11, 2025

పెద్దపల్లి BC JAC వైస్ ఛైర్మన్‌గా కొండి సతీష్‌

image

PDPL బీసీ JAC వైస్ ఛైర్మన్‌గా తెలంగాణ ఉద్యమకారుడు, సామాజిక విశ్లేషకుడు కొండి సతీష్ నియమితులయ్యారు. ఈ మేరకు రాష్ట్ర BC JAC ఆదేశాల మేరకు జిల్లా ఛైర్మన్‌ దాసరి ఉషా ఉత్తర్వులు జారీచేశారు. ఈ సందర్భంగా కొండి సతీష్ మాట్లాడుతూ.. BCలకు రాజ్యాంగబద్ధంగా 42% రిజర్వేషన్లు సాధించే వరకు పోరాటం కొనసాగుతుందని తెలిపారు. BCల ఐక్యత, కులవృత్తుల అభివృద్ధి, రాజకీయ శక్తివర్ధన దిశగా BC JAC కృషి చేస్తుందని స్పష్టం చేశారు.