News February 9, 2025

మినీ మేడారం జాతర మరో మూడు రోజులే!

image

ములుగు జిల్లా తాడ్వాయి మండలం మేడారం సమ్మక్క-సారలమ్మ మినీ జాతర మరో మూడు రోజుల్లో ప్రారంభం కానుంది. ఈ జాతరకు 20 లక్షల మందికి పైగా భక్తులు వచ్చి దర్శించుకుంటారని అధికారులు అంచనా వేస్తున్నారు. జాతరకు వచ్చే భక్తులకు జంపన్న వాగు వద్ద స్నానాలు ఆచరించడానికి షవర్లు, తాగునీటి సదుపాయం, పార్కింగ్ స్థలాలను ఇప్పటికే అధికారులు సిద్ధం చేశారు. బుధవారం నుంచి శనివారం వరకు మినీ జాతర జరగనుంది.

Similar News

News February 12, 2026

GNT: YCP రాష్ట్ర యువజన జాయింట్ సెక్రటరీగా సంజీవ రెడ్డి

image

వైసీపీ రాష్ట్ర యువజన విభాగం జాయింట్ సెక్రటరీగా ఫిరంగిపురం మండలం నుదురుపాడుకు చెందిన సంజీవరెడ్డి నియమితులయ్యారు. ఈ మేరకు పార్టీ కేంద్ర కార్యాలయం గురువారం ఉత్తర్వులు జారీ చేసింది. తన నియామకానికి సహకరించిన నియోజకవర్గ సమన్వయకర్త డైమండ్ బాబుకు, పార్టీ అధిష్ఠానానికి సంజీవరెడ్డి కృతజ్ఞతలు తెలిపారు.

News February 12, 2026

పాలమూరు: కాంగ్రెస్ పాలనలో అభివృద్ధి పరుగులు: మంత్రి

image

ప్రజల ప్రయోజనాలతో మౌలిక వసతులు కల్పించడం ప్రభుత్వ లక్ష్యమని మంత్రి వాకిటి శ్రీహరి వెల్లడించారు. అచ్చంపేట పట్టణంలో పలు అభివృద్ధి కార్యక్రమాలకు ఎమ్మెల్యే వంశీకృష్ణతో కలిసి మంత్రి శంకుస్థాపనలు, ప్రారంభోత్సవాలు చేశారు. గత BRS ప్రభుత్వ 10 ఏళ్ల పాలనలో తెలంగాణ నిర్లక్ష్యానికి గురైందని, కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన రెండేళ్లలోనే అభివృద్ధిలో పరుగులు పెట్టిస్తోందని మంత్రి అన్నారు.

News February 12, 2026

మేడారం హుండీ ఆదాయం రూ.13,51,76,275

image

మేడారం వన దేవతల జాతరలో భక్తులు సమర్పించిన కానుకల లెక్కింపు ప్రక్రియ పూర్తయింది. మొత్తం హుండీలను తెరిచి 8 రోజుల పాటు లెక్కించగా రూ.13,51,76,275 ఆదాయం సమకూరినట్లు ఎండోమెంట్ ఉప కమిషనర్ రామల సునీత తెలిపారు. సమ్మక్క ప్రాంగణంలో ఏర్పాటు చేసిన 309, సారలమ్మ ప్రాంగణంలో 309, గోవిందరాజు వద్ద 81, పగిడిద్దరాజు వద్ద 81 హుండీలను పూర్తిగా లెక్కించారు.