News September 26, 2024
మిర్చి యార్డుకు 53,149 బస్తాల మిర్చి

మిర్చి మార్కెట్ యార్డుకు నిన్న 53,149 బస్తాలు రాగా, గత నిల్వలతో కలిపి ఈ-నామ్ విధానం ద్వారా 51,038 బస్తాలు అమ్మకాలు జరిగాయి. నాన్ ఏసీ కామన్ రకం 334, 273, 341. 4884, సూపర్-10 రకాల మిర్చి సగటు ధర రూ.8.500 నుంచి రూ.17,000 వరకు పలికింది. నాన్ ఏసీ ప్రత్యేక రకం తేజ, బాడిగ, దేవనూరు డీలక్స్ రకాల మిర్చి సగటు ధర రూ.8,000 నుంచి 18,000 వరకు లభించింది. ఏసీ కామద్ రకం మిర్చి రూ.9,000 నుండి 16,500 వరకు లభించింది.
Similar News
News October 24, 2025
పత్తి సేకరణలో సందేహాలు నివృత్తి చేయాలి: కలెక్టర్

పత్తి రైతుల రిజిస్ట్రేషన్ ప్రారంభించాలని కలెక్టర్ ఏ.తమీమ్ అన్సారియా వ్యవసాయ మార్కెటింగ్ అధికారులను ఆదేశించారు. పత్తి, ధాన్యం కొనుగోలు పై అధికారులతో కలెక్టర్ సమీక్షించారు. రైతు సేవా కేంద్రం వారిగా రైతులతో సమావేశం నిర్వహించి పూర్తి వివరాలు తెలియజేయాలన్నారు. ప్రాంతాల వారీగా పత్తి ఉత్పాదకత వివరాలు సమర్పించాలని ఆదేశించారు. పత్తి సేకరణలో తరచూ తలెత్తే సందేహాలను స్పష్టంగా నివృత్తి చేయాలన్నారు.
News October 24, 2025
ANU: ‘ఇన్ఛార్జ్ వీసీ సాధారణ విధులను మాత్రమే నిర్వర్తిస్తారు’

ANU ఇన్ఛార్జ్ VC సాధారణ విధులను మాత్రమే నిర్వర్తిస్తారని, జీతాల పంపిణీ మినహా కాంట్రాక్టర్లకు చెల్లింపులు, కొత్త నియామకాలు, సిబ్బందిని క్రమబద్ధీకరించడం వంటి విధానాలు లేదా ఆర్థిక నిర్ణయాలు తీసుకోకూడదని రాష్ట్ర ఉన్నత విద్యాశాఖ కార్యదర్శి ANU ఇన్ఛార్జ్ VCకి శుక్రవారం ఉత్తర్వులు జారీ చేశారు. వర్సిటీలో ఖర్చులకు ‘మించి’ బిల్లులు ఉన్నాయని ‘Way2News’ప్రచురించిన నేపథ్యంలో ఈ ఉత్తర్వులు ఆసక్తికరంగా మారాయి.
News October 24, 2025
పోలీస్ సిబ్బంది సంక్షేమానికి అత్యంత ప్రాధాన్యం: ఎస్పీ

గుంటూరు జిల్లా పోలీస్ కార్యాలయంలో ప్రతి శుక్రవారం నిర్వహించే “పోలీస్ సిబ్బంది గ్రీవెన్స్ డే” కార్యక్రమంలో ఎస్పీ వకుల్ జిందాల్ పాల్గొని సిబ్బంది నుంచి వచ్చిన 8 వినతులను స్వీకరించారు. వాటి పరిష్కారం కోసం సంబంధిత అధికారులను ఆదేశించారు. పోలీస్ సిబ్బంది సంక్షేమానికి తాము అత్యంత ప్రాధాన్యత ఇస్తామని ఎస్పీ తెలిపారు. సమస్యలు పరిష్కారమైతేనే వారు ప్రజలకు మెరుగైన సేవలు అందించగలరని ఆయన అన్నారు.


