News July 13, 2024
మిర్యాలగూడలో భారీగా గంజాయి పట్టివేత

మిర్యాలగూడ నెల్లిమెట్ల జంక్షన్ వద్ద రూరల్ ఎస్సై ధనుంజనాయుడు, సిబ్బంది వాహన తనిఖీలు చేపట్టానే. చింతపల్లివైపు నుంచి వస్తున్న కారును చూసి అనుమానం వచ్చి తనిఖీ చేశారు. దీంతో కారులో 140కేజీల గంజాయి బయటపడింది. విలువ సుమారు రూ. 35 లక్షల ఉంటుందన్నారు. నిందితులు అరుణ్, రేంజు, ఆనంద్, కొర్ర అర్జున్లను అరెస్టు చేసి స్టేషన్కు తరలించారు. మరో నలుగురు పరారీలో ఉన్నారని వెల్లడించారు.
Similar News
News October 31, 2025
NLG: ఉదయం బదిలీ… మధ్యాహ్నం డిప్యూటేషన్!

నల్గొండలోని జిల్లా స్టాంపులు, రిజిస్ట్రేషన్ శాఖలో అక్రమ బదిలీల వ్యవహారం కలకలం రేపుతుంది. ఇక్కడ పనిచేస్తున్న ఓ ఉద్యోగిని మరో చోటికి ఉదయం బదిలీ చేసి మధ్యాహ్నం డిప్యూటేషన్ పై మళ్లీ ఇక్కడికే తీసుకురావడం చర్చనీయాంశంగా మారింది. గంటల వ్యవధిలోనే తిరిగి సదరు ఉద్యోగికి యధాతధ పోస్టు అప్పగించడంపై తోటి ఉద్యోగులు మండిపడుతున్నారు. ఆ ఉద్యోగి అక్రమాలపై ప్రభుత్వం విచారణ చేయాలని కోరుతున్నారు.
News October 31, 2025
NLG: శిశు విక్రయాలకు అడ్డుకట్టపడేదెప్పుడో!

జిల్లాలో శిశు విక్రయాలు కలకలం రేపుతున్నాయి. పేదరికం, నిరక్షరాస్యత, అధిక సంతానం కారణంగానే జిల్లాలో ఎక్కువగా గిరిజన తండాల్లో శిశు విక్రయ ఘటనలు తరుచూ వెలుగు చూస్తున్నాయి. ఎవరికీ తెలియకుండానే పసిపిల్లల విక్రయాలు సాగుతున్నాయన్న చర్చ జరుగుతోంది. జిల్లాలో 2020 నుంచి ఇప్పటివరకు సుమారుగా 52 శిశు విక్రయాలు జరిగినట్లు తెలుస్తుంది. శిశువిక్రయాలకు అడ్డుకట్ట వేయాలని జిల్లా ప్రజలు కోరుతున్నారు.
News October 31, 2025
NLG: 6.7 KM పొడవునా దెబ్బతిన్న రోడ్లు

జిల్లాలో రోడ్డు భవనాల శాఖ పరిధిలోని 24 ప్రాంతాల్లో 6.7 కిలోమీటర్ల పొడవున రోడ్లు దెబ్బతినగా అందులో 15 ప్రాంతాల్లో పూర్తిగా ధ్వంసమై రాకపోకలకు తీవ్ర అంతరాయం ఏర్పడింది. వాటిల్లో గురువారం 7 ప్రాంతాల్లో రాకపోకలను పునరుద్ధరించారు. వాటి తాత్కాలిక మరమ్మతులకు రూ.35 లక్షలు అవసరమని అధికారులు అంచనా వేశారు. శాశ్వత మరమ్మతులకు రూ.9.70 కోట్లు అవసరమని ప్రతిపాదించినట్లు అధికారులు తెలిపారు.


