News June 16, 2024

మిర్యాలగూడ: ఉరి వేసుకుని ఓ వ్యక్తి ఆత్మహత్య

image

ఉరి వేసుకుని వ్యక్తి ఆత్మహత్యకు పాల్పడిన ఘటన మిర్యాలగూడ పట్టణంలో చోటుచేసుకుంది. ఎస్సై రాంబాబు వివరాల ప్రకారం.. పట్టణంలోని బంగారు గడ్డకు చెందిన మారేండ్ల సైదులు ఆటో నడుపుతూ జీవనం సాగిస్తున్నాడు. కొద్ది రోజులుగా భార్య, భర్తల మధ్య గొడవలు జరుగుతున్నాయి. ఇంట్లో ఎవరూ లేని సమయంలో ఉరి వేసుకొని ఆత్మహత్యకు పాల్పడ్డాడు. మృతునికి భార్య, ఇద్దరు సంతానం ఉన్నారు. పోలీసులు కేసు నమోదు చేసుకున్నారు.

Similar News

News January 5, 2026

NLG: మండలాల్లో అటకెక్కిన ప్రజావాణి

image

NLGలో ప్రజావాణికి వినతులు వెల్లువెత్తడంతో, గత ప్రభుత్వం మండల కేంద్రాల్లోనూ ఈ కార్యక్రమాన్ని ప్రారంభించింది. అయితే అనేక మండలాల్లో ప్రజావాణి కార్యక్రమం మూణ్నాళ్ల ముచ్చటగానే మిగిలిపోయింది. మొదట్లో మండల పరిషత్, రెవెన్యూ కార్యాలయాల్లో కొద్దిరోజులు నిర్వహించినప్పటికీ, ప్రస్తుతం అన్ని చోట్లా నిలిచిపోయింది. దీంతో గ్రామస్థులు తమ సమస్యల పరిష్కారం కోసం తిరిగి జిల్లా కేంద్రాలకు వెళ్లాల్సిన పరిస్థితి నెలకొంది.

News January 5, 2026

NLG: అమ్మ బాబోయ్.. కేజీ రూ.300లా!

image

నల్గొండ జిల్లాలో చికెన్ రేటు ట్రిపుల్ సెంచరీ కొట్టింది. కిలో మాంసం రూ.300కి చేరడంతో మాంసం ప్రియులు బెంబేలెత్తుతున్నారు. గుడ్డు ధర రూ.8.50 ఉండగా.. లైవ్ కోడి రూ.185, స్కిన్‌లెస్ రూ.290-310 పలుకుతోంది. బర్డ్ ఫ్లూతో ఉత్పత్తి తగ్గిందని, అందుకే రేట్లు పెరిగాయని వ్యాపారులు అంటున్నారు. పండగ పూట ముక్క లేకపోతే ఎలా అని మాంసం ప్రియులు వాపోతుండగా, రేట్లు ఇప్పట్లో దిగిరావని మార్కెట్ వర్గాలు అంచనా వేస్తున్నాయి.

News January 5, 2026

NLG: అమ్మ బాబోయ్.. కేజీ రూ.300లా!

image

నల్గొండ జిల్లాలో చికెన్ రేటు ట్రిపుల్ సెంచరీ కొట్టింది. కిలో మాంసం రూ.300కి చేరడంతో మాంసం ప్రియులు బెంబేలెత్తుతున్నారు. గుడ్డు ధర రూ.8.50 ఉండగా.. లైవ్ కోడి రూ.185, స్కిన్‌లెస్ రూ.290-310 పలుకుతోంది. బర్డ్ ఫ్లూతో ఉత్పత్తి తగ్గిందని, అందుకే రేట్లు పెరిగాయని వ్యాపారులు అంటున్నారు. పండగ పూట ముక్క లేకపోతే ఎలా అని మాంసం ప్రియులు వాపోతుండగా, రేట్లు ఇప్పట్లో దిగిరావని మార్కెట్ వర్గాలు అంచనా వేస్తున్నాయి.