News March 9, 2025
మిర్యాలగూడ: చనిపోయి నలుగురికి పునర్జన్మనిచ్చాడు

మిర్యాలగూడ శాంతినగర్కు చెందిన సందీప్ ఇటీవల జరిగిన రోడ్డు ప్రమాదంలో గాయపడి బ్రెయిన్ డెడ్కు గురయ్యాడు. విషయం తెలుసుకున్న జీవన్ దాన్ సంస్థ సభ్యులు సందీప్ కుటుంబ సభ్యులను సంపద్రించడంతో వారు అవయవదానానికి ఒప్పుకున్నారు. సందీప్ గుండె, కాలేయం, కిడ్నీలు, కార్నియా సేకరించారు. సందీప్ మరణించినప్పటికీ అవయవదానం చేసి మరో నలుగురికి పునర్జన్మను ఇచ్చారని పలువురు సందీప్ కుటుంబ సభ్యులను అభినందించారు.
Similar News
News October 15, 2025
నల్గొండ: బాలికపై అత్యాచారం.. ఏడేళ్ల జైలు శిక్ష

నల్గొండలో మైనర్పై అత్యాచారం కేసులో పోక్సో కోర్టు సంచలన తీర్పు ఇచ్చింది. తొమ్మిదేళ్ల బాలికపై అత్యాచారం చేసిన ఉప్పల నాగార్జునకు ఏడేళ్ల జైలు శిక్షతో పాటు రూ.15 వేలు జరిమానా విధించింది. బాధితురాలికి రూ.7 లక్షల పరిహారం చెల్లించాలని ఇన్ఛార్జ్ న్యాయమూర్తి రోజారమణి తీర్పు చెప్పారు. 2019లో మోతే పోలీస్ స్టేషన్లో ఈ కేసు నమోదైంది.
News October 15, 2025
NLG: జిల్లాకు కొత్తగా ఎనిమిది మంది ఎంపీడీవోలు

జిల్లాకు కొత్తగా 8 మంది ఎంపీడీఓలు రానున్నారు. ఇటీవల గ్రూప్-1 ద్వారా ఎంపికైన వారిలో జిల్లాకు 8 మంది ఎంపీడీవోలను ప్రభుత్వం కేటాయించింది. అయితే వారిలో ముగ్గురు విధుల్లో చేరి తిరిగి HYDలో శిక్షణకు హాజరుకానున్నారు. మిగతా వారు ఇప్పటికే ఇతర శాఖల్లో ఉద్యోగాలు నిర్వహిస్తున్నందున శిక్షణ అనంతరం ఆ శాఖలో రిలీవై ఎంపీడీవోలుగా విధుల్లో చేరనున్నట్లు తెలుస్తోంది. వీరి రాకతో జిల్లాలో ఎంపీడీఓల కొరత తీరనుంది.
News October 15, 2025
NLG: ధాన్యం కొనుగోలు కేంద్రాన్ని పరిశీలించిన కలెక్టర్

నల్గొండ జిల్లా చిట్యాల మండలంలో ప్రాథమిక వ్యవసాయ సహకార పరపతి సంఘం ఆధ్వర్యంలో మల్లన్న గుట్ట వద్ద ఏర్పాటు చేసిన ధాన్యం కొనుగోలు కేంద్రాన్ని కలెక్టర్ ఇలా త్రిపాఠి మంగళవారం సందర్శించారు. మ్యాచింగ్ అయిన ధాన్యాన్ని వచ్చినట్లుగానే కొనుగోలు చేయాలని ఆమె ఆదేశించారు. రైతుల వివరాలను రిజిస్టర్లో నమోదు చేయాలని సూచించారు. అదనపు కలెక్టర్ శ్రీనివాస్, పీఏసీఎస్ సీఈవో బ్రహ్మచారి తదితరులు పాల్గొన్నారు.