News October 9, 2024

మిర్యాలగూడ: టీచర్ అయిన రిక్షావాలా కొడుకు

image

మిర్యాలగూడ పట్టణం రవీంద్రనగర్ కాలనీకి చెందిన ముడావత్ గణేశ్ డీఎస్సీ – 2024 ఫలితాల్లో ఎస్టీ విభాగంలో ఎస్జీటీ ఉద్యోగం సాధించాడు. తండ్రి మూడావత్ పంతులు రిక్షా తొక్కుతూ, తల్లి పండ్లు అమ్ముతూ కుటుంబాన్ని పోషిస్తున్నారు. వీరికి నలుగురు అమ్మాయిలు. ఇద్దరు అబ్బాయిలు సంతానం. చిన్న కుమారుడు గణేశ్ ప్రభుత్వ ఉద్యోగం సాధించడంతో వారు ఆనందం వ్యక్తం చేస్తున్నారు.

Similar News

News October 9, 2024

MLG: ఒకే ఏడాదిలో ఆరు ప్రభుత్వ ఉద్యోగాలు

image

ప్రభుత్వ ఉద్యోగం సాధించడమే గగనమైన ఈరోజుల్లో మిర్యాలగూడ మండలం జాలుబావి తండాకు చెందిన భూక్యా సేవా రాథోడ్ ఒకే ఏడాదిలో ఏకంగా 6 ప్రభుత్వ ఉద్యోగాలు సాధించి సత్తా చాటాడు. ఇటీవల వెల్లడించిన DSC ఫలితాలలో SA, తెలుగు 8 ర్యాంక్‌తో పాటు SGT ఉద్యోగం సాధించారు. గతంలో గురుకుల జేఎల్ (13 ర్యాంక్), పిజిటి (8 ర్యాంక్), TGT, TSPSC జూనియర్ లెక్చరర్ 13 ర్యాంక్ ఉద్యోగాలు సాధించారు. నేడు సీఎంతో నియామక పత్రం అందుకున్నారు.

News October 9, 2024

చౌటుప్పల్ టోల్ ప్లాజా వద్ద గుండెపోటుతో హెడ్ కానిస్టేబుల్ మృతి

image

చౌటుప్పల్ మండలం పంతంగి టోల్ ప్లాజా వద్ద హైవే పెట్రోలింగ్ విధులు నిర్వహిస్తున్న తిప్పర్తి మండల పోలీస్ స్టేషన్‌కు చెందిన హెడ్ కానిస్టేబుల్ పుట్టా యాదగిరి గుండెపోటుతో మృతిచెందారు. పోలీస్ సిబ్బంది మృతదేహాన్ని ప్రభుత్వాసుపత్రికి తరలించారు. మరింత సమాచారం తెలియాల్సి ఉంది.

News October 9, 2024

నల్గొండ: యూటీఎఫ్ ఎమ్మెల్సీ అభ్యర్థిగా మరోసారి నర్సిరెడ్డి

image

వరంగల్, ఖమ్మం, నల్గొండ ఉపాధ్యాయ నియోజకవర్గం టీఎస్‌యూటీఎఫ్‌ ఎమ్మెల్సీ అభ్యర్థిగా మరోసారి అలుగుబెల్లి నర్సిరెడ్డి బరిలో నిలవనున్నారు. సిట్టింగ్‌ ఎమ్మెల్సీగా ఉన్న ఆయనను 2025 మార్చిలో జరగనున్న ఎన్నికల్లో నిలపాలని TSUTF రాష్ట్ర కమిటీ సమావేశం ఏకగ్రీవంగా నిర్ణయించింది. వర్చువల్‌గా నిర్వహించిన సంఘం రాష్ట్ర కమిటీ సమావేశంలో సభ్యులు ఆమోదించారు.