News March 10, 2025
మిర్యాలగూడ: ప్రణయ్ హత్య కేసు.. JUSTICE SERVED

ఆరేళ్ల క్రితం తెలుగు రాష్ట్రాల్లో సంచలనం రేపిన <<15709750>>ప్రణయ్ హత్య<<>> కేసుకు ఎట్టకేలకు తెరపడింది. ఈరోజు NLG కోర్టు ప్రధాన నిందితుడికి ఉరిశిక్ష, మిగతా వారికి యావజ్జీవ శిక్ష విధించింది. ప్రణయ్, అమృత పరిచయం నుంచి వారి ప్రేమ పెళ్లి.. గొడవలు.. కేసులు.. ప్రణయ్ హత్య.. మారుతీరావు సూసైడ్.. వాదనలు.. విచారణలు.. నేటి కోర్టు తీర్పు వరకు ప్రతి సందర్భం చర్చనీయాంశం అవగా ఫైనల్గా JUSTICE SERVED అని పలువురు అంటున్నారు.
Similar News
News December 1, 2025
‘భూధార్’ కార్డుల కోసం ‘mభూధార్’ యాప్

TG: ఆధార్ మాదిరిగా ప్రతి వ్యవసాయ భూమికి ప్రత్యేక ID నంబర్తో కూడిన ‘భూధార్’ కార్డులను ప్రభుత్వం జారీ చేయనుంది. భూముల యాజమాన్య హక్కుల ఆధారంగా రైతులకు అందించనుంది. ఇందుకు సంబంధించి రెవెన్యూ శాఖ ఇప్పటికే ‘mభూధార్’ ప్రత్యేక యాప్ను ప్రారంభించింది. స్థానిక ఎన్నికల అనంతరం 2026 JAN నుంచి ఇవి పంపిణీ అవుతాయి. వీటితో భూ వివాదాల తగ్గుదల, సులభ లావాదేవీలు, డిజిటలైజేషన్, పథకాల సక్రమ అమలుకు అవకాశం ఉంటుంది.
News December 1, 2025
విపత్తుల సమయంలో ముందస్తు జాగ్రత్తలపై శిక్షణ: కలెక్టర్

విపత్తులు, ప్రకృతి వైపరీత్యాల సమయంలో తక్షణమే స్పందించి రక్షణ చర్యలు చేపట్టేలా చర్యలు తీసుకోవాలని కలెక్టర్ డా.ఎన్.ప్రభాకరరెడ్ది అన్నారు. సోమవారం పార్వతీపురంలోని కలెక్టరేట్ ఆవరణలో రాష్ట్ర విపత్తులు, అగ్నిమాపక సేవల శాఖ పరికరాలను ఆయన పరిశీలించారు. విపత్తుల కోసం గ్రామస్థాయిలో వాలంటీర్లను ఏర్పాటుచేసుకొని వారికి శిక్షణ ఇవ్వాలని సూచించారు.
News December 1, 2025
VJA: దుర్గమ్మను దర్శించుకున్న తెలంగాణ సీఎం సోదరుడు

తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి సోదరుడు జగదీశ్వర్ రెడ్డి సోమవారం ఇంద్రకీలాద్రిపై కొలువైన దుర్గమ్మ ఆలయాన్ని సందర్శించి, ప్రత్యేక పూజలు చేశారు. ఆలయ అధికారులు ఆయనకు అమ్మవారి చిత్రపటం, ప్రసాదం అందజేశారు. వేదపండితులు ఆశీర్వచనం ఇచ్చారు. కార్యక్రమంలో ఆలయ ధర్మకర్త బడేటి ధర్మారావు, టీడీపీ రాష్ట్ర నాయకుడు రాంప్రసాద్తో పాటు పలువురు పాల్గొన్నారు.


