News February 1, 2025
మిర్యాలగూడ: భూ తగాదాలతో యువకుడిపై హత్యాయత్నం..!

మిర్యాలగూడ కోర్టు ఎదుట దామరచర్ల మం. వీర్లపాలెంకి చెందిన అల్లం మహేశ్పై నలుగురు యువకులు కత్తులతో దాడి చేసి హత్యాయత్నానికి పాల్పడ్డారు. స్థానికుల వివరాల ప్రకారం.. 30 ఏళ్ల క్రితం మంద మహేశ్, శేఖర్ కుటుంబ సభ్యుల వద్ద అల్లం మహేశ్ కుటుంబ సభ్యులు వీర్లపాలెంలోని భూమిని కొనుగోలు చేశారు. ఆ భూమికి సంబంధించి రెండు కుటుంబాల మధ్య గొడవలు జరుగుతున్నాయి. భూమి విషయంలోనే మహేశ్పై మంద కుటుంబ సభ్యులు దాడి చేశారన్నారు.
Similar News
News September 18, 2025
ఫలితాలను పెంచడంపై దృష్టి సారించాలి: కలెక్టర్

కెజిబివి, ఇంటర్మీడియట్ కళాశాలలో ఫలితాలను పెంచడంపై దృష్టి సారించాలని జిల్లా కలెక్టర్ ఇలా త్రిపాఠి ఆయా పాఠశాలలు, ఇంటర్ కళాశాలల ప్రిన్సిపాల్స్ను ఆదేశించారు. బుధవారం ఆమె కలెక్టర్ కార్యాలయ సమావేశ మందిరంలో కేజీబివిలు, ఇంటర్ కళాశాలల్లో ప్రవేశాలు, అప్లిఏషన్, ఫలితాలు, ఫేస్ రికగ్నిషన్ సిస్టం తదితర అంశాలపై సమీక్ష నిర్వహించారు. గడిచిన 3 సంవత్సరాలలో ప్రవేశాలు తక్కువగా ఉన్నాయని అన్నారు.
News September 17, 2025
స్వాతంత్య్ర పోరాటంతో RSSకు సంబంధం లేదు: బృందాకారత్

భారత స్వాతంత్ర్య పోరాటంతో బీజేపీకి, ఆర్ఎస్ఎస్కు ఎలాంటి సంబంధం లేదని సీపీఎం పొలిట్బ్యూరో సభ్యురాలు బృందా కారత్ స్పష్టం చేశారు. నల్గొండలో జరుగుతున్న వీర తెలంగాణ సాయుధ పోరాట వారోత్సవాల సభలో ఆమె ఈ వ్యాఖ్యలు చేశారు. చరిత్రను వక్రీకరించే ప్రయత్నాలను ప్రజలు తిప్పికొట్టాలని ఆమె పిలుపునిచ్చారు.
News September 16, 2025
బాలికపై అత్యాచారం.. నల్గొండ కోర్టు సంచలన తీర్పు

నల్గొండ పోక్సో కోర్టు సంచలన తీర్పు ఇచ్చింది. నాలుగో తరగతి బాలికపై లైంగిక దాడికి పాల్పడిన 60 ఏళ్ల ఊశయ్యకు 24 ఏళ్ల జైలు శిక్ష విధిస్తూ పోక్సో కోర్టు న్యాయమూర్తి రోజా రమణి తీర్పు చెప్పారు. రూ.40 వేల జరిమానాతో పాటు బాధితురాలికి రూ.10 లక్షల పరిహారం చెల్లించాలని ఆదేశించారు.