News March 7, 2025
మిర్యాలగూడ: యువకుడు ఆత్మహత్య.!

మిర్యాలగూడ రైల్వే స్టేషన్ సమీపంలో యువకుడు ఆత్మహత్య చేసుకున్న ఘటన గురువారం చోటు చేసుకుంది. మిర్యాలగూడ రూరల్ పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. గుర్తు తెలియని యువకుడు రైల్వే స్టేషన్ సమీపంలోని ఓ చెట్టుకు ఉరేసుకుని ఆత్మహత్య చేసుకున్నాడు. సుమారు 25 ఏళ్ల వయస్సు కలిగి బూడిద కలర్ టీ షర్ట్ ధరించి, నల్ల కలరు లోయర్ ధరించి ఉన్నాడు. సమాచారం తెలిసిన వారు రూరల్ ఎస్ఐ లోకేష్ కుమార్ 8712670189కు తెలపాలని కోరారు.
Similar News
News September 19, 2025
నల్గొండ: ‘నా కోరిక తీరిస్తే B.Ed పాస్ చేస్తా’

నల్గొండలోని డైట్ పాఠశాలలో ఓ ఉపాధ్యాయుడు B.Ed విద్యార్థినిని వేధించిన ఘటన ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. తన కోరిక తీరిస్తే B.Ed పాస్ చేయిస్తానని సదరు ఉపాధ్యాయుడు వేధింపులకు గురి చేస్తున్నట్లు సమాచారం. గతంలోనూ ఈ ఉపాధ్యాయుడు పాఠశాలలో చదువుతున్న బాలికలకు ముద్దులు పెట్టడం, వెకిలి చేష్టలకు పాల్పడటంతో అతడిని దేహశుద్ధి చేసినట్లు తెలిసింది. అతడిపై చర్యలు తీసుకోవాలని విద్యార్థులు డిమాండ్ చేస్తున్నారు.
News September 19, 2025
రాజమండ్రి నుంచి తిరుపతికి విమాన సర్వీస్

రాజమండ్రి విమానాశ్రయం నుంచి దేశంలోని ప్రధాన నగరాలకు విమాన సర్వీసులు అందుబాటులోకి తీసుకువస్తున్నట్లు ఎయిర్పోర్ట్ డైరెక్టర్ ఎన్.కె.శ్రీకాంత్ శుక్రవారం తెలిపారు. ఈ నేపథ్యంలో అక్టోబరు 1న తిరుపతికి విమాన సర్వీస్ ప్రారంభం అవుతుందని చెప్పారు. వారానికి మూడు రోజులు ఈ విమాన సర్వీసు నడుస్తుందని వెల్లడించారు.
News September 19, 2025
చీఫ్ ఇంజినీర్ ముందే బీఎన్ పనులు చేయలేమన్న కాంట్రాక్టర్

R&Bచీఫ్ ఇంజనీర్ (NDB) విజయశ్రీ ముందే రోడ్డు మరమ్మతులు చేయలేమని కాంట్రాక్టర్ చేతులెత్తేశారు. న్యూ డెవలప్మెంట్ బ్యాంక్ (NDB)నిధులతో నిర్మాణంలో ఉన్న జిల్లాలోని రోడ్లు శుక్రవారం పరిశీలించారు. బి.ఎన్ రోడ్డుపై ఏర్పడిన భారీ గుంతలును పూడ్చాలని కాంట్రాక్టర్ వెంకటేశ్వరావును ఆదేశించారు. ఇప్పటికే ఈ రోడ్డు పనులకు రూ.10 కోట్లు వెచ్చించామని ఇంతవరకు ఈ బిల్లు ఇవ్వనందున ఇక పనులు చేయలేమన్నారు.