News April 5, 2025
మిర్యాలగూడ సబ్ కలెక్టర్కు నిర్వాసితుల సత్కారం

దామరచర్లలోని యాదాద్రి పవర్ ప్లాంట్లో భూనిర్వాసితులైన 112 మందికి ఉద్యోగ నియమాక పత్రాలు జెన్కో అందజేసింది. కాగా భూనిర్వాసితులకు ఉద్యోగాలు ఇవ్వాలని మిర్యాలగూడ సబ్ కలెక్టర్ నారాయణ అమిత్ జెన్కో, ప్రభుత్వానికి జాబితా పంపించారు. ఈ విషయమై 112 మందికి ఉద్యోగ నియమాక పత్రాలు అందజేశారు. సబ్ కలెక్టర్ వల్లనే తమకు ఉద్యోగాలు వచ్చాయని భూ నిర్వాసితులు ఆనందం వ్యక్తం చేస్తూ మిర్యాలగూడలో ఆయనను సన్మానించారు.
Similar News
News December 7, 2025
నల్గొండ: మహిళలకు ఫ్రీ ట్రైనింగ్

నల్గొండలోని దుర్గాబాయి మహిళా శిశు వికాస కేంద్రంలో టైలరింగ్, కంప్యూటర్ కోర్సులో ఉచిత శిక్షణకు ఆసక్తి గల మహిళలు దరఖాస్తు చేసుకోవాలని మహిళా శిశు వికాస కేంద్రం మేనేజర్ ఎ.అనిత తెలిపారు. అర్హత, పూర్తి వివరాల కోసం కార్యాలయంలో సంప్రదించాలని సూచించారు. మహిళలు ఈ శిక్షణను సద్వినియోగం చేసుకోవాలన్నారు.
News December 6, 2025
మర్రిగూడ: పట్టుబడుతున్నా మారట్లేదు

మర్రిగూడ తహశీల్దార్ కార్యాలయం అక్రమాలకు అడ్డాగా మారిందన్న చర్చ నడుస్తోంది. గతంలో పనిచేసిన తహశీల్దార్లు మహేందర్ రెడ్డి, వెంకట్ రెడ్డి, డిప్యూటీ తహశీల్దార్ చంద్రశేఖర్, సర్వేయర్ రవి నాయక్ పలువురి వద్ద డబ్బులు డిమాండ్ చేస్తూ ఏసీబీకి పట్టుబడడం మండలంలో చర్చనీయాంశమైంది. ఇప్పటికైనా అధికారులు తమ తీరు మార్చుకుని సక్రమంగా విధులు నిర్వహించి మర్రిగూడకు మంచి పేరు తీసుకురావాలని మండల ప్రజలు కోరుతున్నారు.
News December 6, 2025
NLG: 3,035 సమస్యాత్మక పోలింగ్ కేంద్రాలు

నల్గొండ జిల్లా వ్యాప్తంగా 7,494 పోలింగ్ స్టేషన్లో ఉంటే.. 3,035 సమస్యాత్మక పోలింగ్ స్టేషనులను పోలీసులు గుర్తించారు. ఈ క్రిటికల్ పోలింగ్ కేంద్రాలలో ఐదు నుంచి 6 మంది సిబ్బందితో భద్రత కల్పించనున్నారు. గ్రామాల్లో గొడవలకు పాల్పడే వారిపై నిరంతరం నిఘా ఉంటుందని ఎస్పీ శరత్ చంద్ర పవర్ తెలిపారు. ప్రతి మండలంలో నలుగురు ఎస్ఐలతో పర్యవేక్షణ నిర్వహిస్తున్నట్లు తెలిపారు.


