News March 10, 2025

మిలియన్ మార్చ్‌కు ప్రత్యేక స్థానం: దాస్యం

image

తెలంగాణ ఉద్యమ చరిత్రలో మిలియన్ మార్చ్(10 మార్చి, 2011)కు ప్రత్యేక స్థానం ఉందని మాజీ చీఫ్ విప్ దాస్యం వినయ్ భాస్కర్ ట్వీట్ చేశారు. ఉద్యమ సారథి కేసీఆర్ నాయకత్వంలో, నిర్బంధాలను చేదిస్తూ, జై తెలంగాణ నినాదాలతో యావత్ తెలంగాణ హుస్సేన్ సాగర్ తీరానికి చేరిందని, అపూర్వ ఘట్టం నేటితో 14 ఏళ్లు అని, తాను కార్యక్రమంలో పాల్గొన్న ఫోటోలను వినయ్ భాస్కర్ జతపరిచారు.

Similar News

News November 17, 2025

MNCL: బైక్ చక్రంలో చీరకొంగు ఇరుక్కొని మహిళ మృతి

image

రోడ్డు ప్రమాదంలో మహిళ మృతి ఘటన స్థానికంగా కలకలం రేపింది. గోదావరిఖని గోదావరి బ్రిడ్జి వద్ద ఆదివారం రాత్రి ప్రమాదం జరిగింది. MNCL జిల్లా వేమనపల్లికి చెందిన లత(35) తమ్ముడు అరుణ్ బైక్ పై GDK నుంచి ఇంటికి వెళ్తుంది. ఈ క్రమంలో తన చీర కొంగు వెనుక వీల్‌లో ఇరుక్కుపోవడంతో ఇద్దరు కింద పడ్డారు. ఇద్దరికి తీవ్ర గాయాలు కాగా లత అక్కడికక్కడే మృతిచెందింది. టూ టౌన్ పోలీసులు కేసు నమోదు చేశారు.

News November 17, 2025

గోదావరిఖని: బైక్ టైర్లో చీర ఇరుక్కుని మహిళ మృతి

image

GDKలోని గోదావరి నది బ్రిడ్జి వద్ద ఆదివారం రాత్రి ప్రమాదం జరిగింది. మంచిర్యాల(D) వేమనపల్లికి చెందిన పుష్పలత GDK నుంచి తన గ్రామానికి తమ్ముడు అరుణ్‌తో కలిసి బైక్‌పై వెళ్తుంది. ఈ క్రమంలో బ్రిడ్జ్ వద్ద తన చీర కొంగు బండి వెనుక టైర్లో ఇరుక్కుపోవడంతో ఇద్దరూ కింద పడిపోయారు. ఈ ఘటనలో పుష్పలత అక్కడికక్కడే మరణించగా అరుణ్‌కు తీవ్ర గాయాలయ్యాయి. 2 టౌన్ పోలీసులు కేసు నమోదు చేసి క్షతగాత్రుడిని ఆసుపత్రికి తరలించారు.

News November 17, 2025

భారతీయ ఉద్యోగికి UAE అత్యుత్తమ బహుమతి!

image

UAE ఇచ్చే ‘అత్యుత్తమ ఉద్యోగి’ బహుమతిని ఇండియన్ గెలుచుకున్నారు. బుర్జీల్ హోల్డింగ్స్‌లో HR మేనేజర్‌గా అనాస్ కడియారకం(KL) పని చేస్తున్నారు. ఎమిరేట్స్ లేబర్ మార్కెట్ అవార్డ్స్‌లో అత్యుత్తమ వర్క్‌ఫోర్స్ కేటగిరీలో ఫస్ట్ ప్రైజ్ సాధించారు. ఆయనకు ట్రోఫీ, ₹24L, బంగారు నాణెం, యాపిల్ వాచ్, ఫజా ప్లాటినం కార్డు అందజేశారు. గతంలో కరోనా టైమ్‌లో సేవలకు హీరోస్ ఆఫ్ ది UAE మెడల్, గోల్డెన్ వీసాను అనాస్ అందుకున్నారు.