News February 23, 2025

మిస్సింగ్ కేసులను ఛేదించిన విశాఖ పోలీసులు

image

విశాఖ టూ టౌన్ స్టేషన్ పరిధిలో విశాఖ, విజయనగరానికి చెందిన రెండు మిస్సింగ్ కేసులు నమోదు అయ్యాయి. ఈ మిస్సింగ్ కేసులపై టూ టౌన్ పోలీసులు విస్తృతంగా తనిఖీలు చేసి గుర్తించారు. ఇద్దరు మహిళలను శనివారం వారి కుటుంబ సభ్యులకు సురక్షితంగా అప్పగించారు. రెండు మిస్సింగ్ కేసులను ఛేదించిన టూ టౌన్ పోలీసులను ఉన్నతాధికారులు అభినందించారు.

Similar News

News February 23, 2025

విశాఖ జిల్లాలో TODAY TOP NEWS

image

➤విశాఖ: లోకల్‌బాయ్ నానికి రిమాండ్..! ➤విశాఖ: యువకుడిని కాపాడిన లైఫ్ గాడ్స్ ➤విశాఖలో నకిలీ పోలీస్ అరెస్ట్ ➤ శివరాత్రి స్పెషల్.. అప్పికొండ, R.K బీచ్‌లకు ప్రత్యేక బస్సులు ➤ విశాఖ: యాక్సిడెంట్‌లో భర్త మృతి.. భార్యకు గాయాలు ➤గాజువాకలో యువకుడు సూసైడ్? ➤విశాఖలో గ్రూప్‌-2 పరీక్ష.. డ్రోన్లతో నిఘా..! ➤ఆనందపురం హైవేపై ట్రావెల్స్ బస్సు బోల్తా

News February 23, 2025

విశాఖలో ప్రశాంతంగా ముగిసిన గ్రూప్ -2 మెయిన్ పరీక్ష

image

విశాఖలో గ్రూప్ -2 మెయిన్ ఎగ్జామ్స్ ప్రశాంతంగా ముగిశాయి. ఈ పరీక్షలకు మొత్తం విశాఖలో 16 కేంద్రాల్లో 11,030 మంది అభ్యర్థులు హాజరు అవ్వాల్సి ఉండగా అందులో ఉదయం పరీక్షకు 9,391 మంది హాజరయ్యారు. 1639 మంది గైర్హాజరు అయ్యారు. మధ్యాహ్నం పరీక్షకు 11,030 మంది అభ్యర్థులు హాజరు అవ్వాల్సి ఉండగా అందులో 9370 మంది హాజరయ్యారు. 1660 మంది రాలేదని అధికారులు తెలిపారు.

News February 23, 2025

విశాఖలో కేంద్ర బడ్జెట్‌పై సమీక్ష 

image

విశాఖలో బీజేపీ ఆధ్వర్యంలో కేంద్ర బడ్జెట్ 2025-26పై ఆదివారం మేధావుల సమావేశం నిర్వహించారు. ఈ కార్యక్రమంలో కేంద్ర సహాయ మంత్రి భూపతిరాజు శ్రీనివాస్ వర్మ పాల్గొన్నారు. వికసిత్ భారత్ లక్ష్యంగా 2025-26 బడ్జెట్ ఉందన్నారు. రాజకీయ ప్రయోజనాలకు కాకుండా దేశ ప్రయోజనాలకే బడ్జెట్‌లో ప్రాధాన్యత ఇచ్చారని, విద్య, వైద్యంకు ప్రాధాన్యత ఇస్తూ బడ్జెట్‌లో రైతులకు పెద్ద పీట వేశారన్నారు. MLA విష్ణు కుమార్ రాజు ఉన్నారు.

error: Content is protected !!