News August 3, 2024
మీసేవ సర్వీసులు పునరుద్ధరించాలని సీఎంకు వినతి

మీ సేవ సర్వీసులను పునరుద్ధరించాలని కోరుతూ శనివారం మంగళగిరి టీడీపీ కార్యాలయంలో మీసేవ నిర్వాహకుల సీఎం చంద్రబాబుకు వినతిపత్రం అందజేశారు. గత ప్రభుత్వం సచివాలయ వ్యవస్థను తెచ్చి మీ సేవను రోడ్డున పడవేసిందని ఆవేదన వ్యక్తం చేశారు. సీఎం చంద్రబాబు మాట్లాడుతూ.. మీ సేవపై తనకు పూర్తి అవగాహన ఉందన్నారు. సర్వీసుల పునరుద్ధరణకు చర్యలు చేపడతామని హామీ ఇచ్చారు.
Similar News
News December 16, 2025
GNT: నిలకడగా స్క్రబ్ టైఫస్ రోగుల ఆరోగ్య పరిస్థితి

గుంటూరు జీజీహెచ్లో స్క్రబ్ టైఫస్ జ్వరాలతో చికిత్స పొందుతున్న రోగుల ఆరోగ్య పరిస్థితి నిలకడగా ఉంది. బుధవారం జీజీహెచ్కు వచ్చిన 13 మంది జ్వర బాధితుల నమూనాలను పరీక్షించగా, మంగళగిరి, అమృతలూరుకు చెందిన ఇద్దరికి స్క్రబ్ టైఫస్ పాజిటివ్గా నిర్ధారణ అయింది. ఆ ఇద్దరిని ఇన్పేషెంట్లుగా చేర్చుకుని వైద్యం అందిస్తున్నట్లు ఆసుపత్రి వర్గాలు వెల్లడించాయి.
News December 16, 2025
GNT: నూతన కానిస్టేబుల్స్తో నేడు సీఎం సమావేశం

పోలీసు శాఖలో నూతనంగా జాయిన్ అవుతున్న వారితో CM చంద్రబాబు మంగళగిరిలో నేడు సమావేశం కానున్నారు. 6,100 మందిని రిక్రూట్ చేసుకునేందుకు నోటిఫికేషన్ ఇవ్వగా అందులో 6,014 మంది సెలక్ట్ అయ్యారు. వీరిలో 5,757 మంది ట్రైనింగ్కు ఎంపిక అయ్యారు. సివిల్ కానిస్టేబుళ్లుగా 3,343 మంది, APSP కానిస్టేబుళ్లుగా 2,414 మంది ఎంపికవ్వగా సివిల్లో మహిళా కానిస్టేబుళ్లు 993 మంది ఉన్నారు. వీరికి ఈ నెల నుంచి ట్రైనింగ్ మొదలవుతుంది.
News December 16, 2025
GNT: శాబర్ జెట్ను కూల్చిన ఆంధ్ర వీరుడు

1965 ఇండో-పాక్ యుద్ధంలో పాకిస్థాన్ శాబర్ జెట్ను కూల్చి చరిత్ర సృష్టించిన వ్యక్తి తెనాలి సమీప నిజాంపట్నానికి చెందిన హవల్దార్ తాతా పోతురాజు. పాత ఎయిర్క్రాఫ్ట్ గన్తో శత్రు విమానాన్ని ఛేదించి భారత సైన్యానికి స్ఫూర్తినిచ్చారు. ఈ వీరోచిత సేవలకు రాష్ట్రపతి రాధాకృష్ణన్ చేతుల మీదుగా ‘వీరచక్ర’ పురస్కారం అందుకున్నారు. 18 ఏళ్లకే సైన్యంలో చేరిన పోతురాజు 1975లో స్వచ్ఛంద విరమణ చేశారు.


