News March 10, 2025
మీ ఊర్లో నీటి సమస్య ఉందా?

ఎండలు రోజురోజుకు పెరుగుతున్నాయి. నంద్యాల జిల్లాలో 36°Cల ఉష్ణోగ్రత నమోదవుతోంది. పలు మున్సిపాలిటీలు, గ్రామాల్లో నీటి సమస్య మొదలవుతోంది. ఈ ఏడాది నీటి ఎద్దడి నివారణకు అధికారులు ప్రణాళిక రూపొందించి ప్రభుత్వానికి పంపించారు. జిల్లాలో 457 పంచాయతీలు ఉండగా నిధులు రాగానే ఉండగా సమస్య ఉన్నచోట ట్యాంకర్లతో సరఫరా, బోర్ల మరమ్మతులు, నూతన పైప్లైన్ పనులు చేపట్టనున్నారు. మరి మీ ఊర్లో నీటి సమస్య ఉందా? కామెంట్ చేయండి.
Similar News
News February 12, 2026
ఆ ఏజెన్సీకి షోకాజ్ నోటీసులు జారీ చేయండి: ఏలూరు కలెక్టర్

ప్రభుత్వ సంక్షేమ వసతి గృహాల్లో ప్రభుత్వం నిర్దేశించిన మెనూ ప్రకారం ఆహరం అందించాలని, మెనూ పాటించని ఏజెన్సీలపై చర్యలు తీసుకుంటానని కలెక్టర్ కె. వెట్రిసెల్వి హెచ్చరించారు. పోలవరం(M) ఇటికలకోట ప్రభుత్వ గిరిజన సంక్షేమ ఆశ్రమ పాఠశాలను బుధవారం ఆకస్మికంగా తనిఖీ చేశారు. పాఠశాలలో మెనూ ప్రకారం మధ్యాహ్న భోజనం అందించని ఏజెన్సీ పనివారిపై ఆగ్రహం వ్యక్తం చేశారు. షోకాజ్ నోటీసు జారీ చేయాలనీ అధికారులను ఆదేశించారు.
News February 12, 2026
విజయనగరం: పెట్రోలో కావలంటే..హెల్మెట్ ధరించాల్సిందే!

రహదారి భద్రతా నియమాల్లో భాగంగా రోడ్డు ప్రమాదాలు నివారించుటకు త్వరలో “నో హెల్మెట్ – నో పెట్రోల్ “ అనే నినాదాన్ని జిల్లా వ్యాప్తంగా అమలు చేస్తామని ఎస్పీ దామోదర్ తెలిపారు. పట్టణంలో బుధవారం జరిగిన వాహన తనిఖీలను పరిశీలించారు. హెల్మెట్ లేని కారణంగా ప్రాణాలు పోతున్నాయన్నారు. రోడ్డు ప్రమాదాల్లో గాయపడ్డ బాధితులను గోల్డెన్ అవర్లో ఆస్పత్రికి చేర్చిన వారికి రూ.5,000 ప్రోత్సాహకం ఉంటుందని స్పష్టం చేశారు.
News February 12, 2026
NRPT: తగ్గిన పోలింగ్ పర్సంటేజ్ అభ్యర్థుల్లో టెన్షన్

నారాయణపేట మున్సిపాల్టీ పరిధిలో నిన్న జరిగిన ఎన్నికల్లో పోలింగ్ పర్సంటేజ్ తగ్గడంతో పోటీ చేసిన అభ్యర్థుల్లో టెన్షన్ మొదలైంది. వార్డుల్లో అనుకున్నదానికంటే తక్కువ పోలింగ్ పర్సంటేజ్ నమోదు కావడంతో ఎవరికి ఎన్ని ఓట్లు వస్తాయి అనేది అనుచరులు, ముఖ్య నాయకులతో కలిసి లెక్కలు వేసుకుంటున్నారు. మొత్తం 24 వార్డులకు గాను 96 మంది అభ్యర్థులు పోటీ చేశారు. వీరిలో 21మంది స్వతంత్రులుగా పోటీ చేశారు.


