News June 20, 2024
మీ సమస్య పరిష్కారం కాలేదా.. నాకు ఫోన్ చేయండి: నంద్యాల ఎస్పీ
పోలీస్ స్టేషన్ SHOల ద్వారా తమ సమస్య పరిష్కారం కాకపోతే ఫిర్యాదుదారుడు నేరుగా తనకు ఫోన్ చేయొచ్చు అని నంద్యాల జిల్లా ఎస్పీ కే.రఘువీర్ రెడ్డి తెలిపారు. 9154987020కు కాల్ లేదా వాట్సాప్ ద్వారా వివరాలు తెలిపి తమ సమస్యకు పరిష్కారం పొందవచ్చని పేర్కొన్నారు. కాగా మొదట SHO వద్దకు వెళ్లాలని, అక్కడ పరిష్కారం కాకపోతేనే తనకు ఫోన్ చేయాలని ఎస్పీ తెలిపారు. ఆన్లైన్ మోసాల పట్ల అప్రమత్తంగా ఉండాలన్నారు.
Similar News
News October 4, 2024
బన్నీ ఉత్సవాలు ప్రశాంతంగా జరుపుకోవాలి: కలెక్టర్
దేవరగట్టు బన్నీ ఉత్సవాలను ప్రశాంతంగా జరుపుకోవాలని కలెక్టర్ రంజిత్ బాషా పేర్కొన్నారు. శుక్రవారం బన్నీ ఉత్సవాల నిర్వహణపై సంబంధిత శాఖల అధికారులు, కమిటీ సభ్యులతో ఆయన సమీక్ష నిర్వహించారు. ఉత్సవాల పోస్టర్ ఆవిష్కరించారు. కార్యక్రమంలో జేసీ డాక్టర్ నవ్య, ఆదోని సబ్ కలెక్టర్ మౌర్య భరద్వాజ్, అసిస్టెంట్ కలెక్టర్ చల్లా కళ్యాణి ఉన్నారు.
News October 4, 2024
Way2News వార్తకు స్పందించిన పోలీసులు.. బాలుడు లభ్యం
గోనెగండ్ల పరిధిలోని చిన్నమరివీడుకు చెందిన వర్ధన్ నాయుడు భారతీ దంపతుల కుమారుడు సూర్యతేజ(14) నిన్నటి రోజు ఇంటి నుంచి అదృశ్యమయ్యాడని తల్లి భారతి రోధించిన తీరును Way2News ప్రచురించింది. సీఐ గంగాధర్ స్పందించి ఏఎస్ఐ తిమ్మారెడ్డిని ఆదేశించడంతో.. బాలుని ఆచూకీ కోసం కర్నూలులో గాలించారు. పాత బస్టాండ్లో ఆచూకీ లభించింది. దీంతో Way2Newsకు, పోలీసులకు తల్లిదండ్రులు కృతజ్ఞతలు తెలిపారు.
News October 4, 2024
ఆలూరు ఎమ్మెల్యే తమ్ముడు సహా 24 మందిపై కేసు
కర్నూలు జిల్లాలోని రెన్యూ విండ్ పవర్, గ్రీన్ ఇన్ఫ్రా కంపెనీల కార్యాలయాలపై దాడులకు పాల్పడిన ఘటనలో పోలీసులు 24 మందిని అదుపులోకి తీసుకున్నారు. ఆలూరు వైసీపీ ఎమ్మెల్యే బసినె విరూపాక్షి తమ్ముడు, వైసీపీ నేత బసినె వెంకటేశ్తో పాటు మరో 23 మందిపై కేసులు నమోదు చేసి అదుపులోకి తీసుకున్నట్లు పత్తికొండ డీఎస్పీ వెంకటరామయ్య తెలిపారు. వారికి సంబంధించిన వాహనాలను సీజ్ చేశారు.