News October 20, 2024
ముంచుకొస్తున్న మరో అల్పపీడనం.. నెల్లూరు జిల్లాపై ప్రభావం

నెల్లూరు జిల్లాపై మరో అల్పపీడనం ప్రభావం ఉన్నట్లు వాతావరణశాఖ హెచ్చరించింది. ఈ నెల 14 నుంచి 16వ తేదీ వరకు 3 రోజుల పాటు జిల్లాను భారీ వర్షాలు వణికించి తెరిపి ఇవ్వడంతో ఊపిరి పీల్చుకుంటున్నారు. మళ్లీ నిన్నటి నుంచే చిరుజల్లుల నుంచి ఓ మోస్తరు వర్షం కురిసింది. ఉత్తర అండమాన్లో ఉపరితల ఆవర్తనం ఏర్పడే అవకాశముందని, ఇది వాయువ్య దిశగా కదిలి అల్పపీడనంగా మారి జిల్లాపై ప్రభావం చూపే అవకాశం ఉందని హెచ్చరించింది.
Similar News
News November 1, 2025
పంటలకు ఆర్థిక సాయం పెంపు : మంత్రి కొలుసు

పంటలకు ఇచ్చే ఆర్థిక సాయాన్ని పెంచామని మంత్రి కొలుసు పార్థసారథి చెప్పారు. గతంలో ధరల స్థిరీకరణకు రూ.3వేల కోట్లు కేటాయించగా.. తాము రూ.6 వేల కోట్లకు పెంచామన్నారు. మామిడికి రూ.260 కోట్లు, పొగాకు రూ.273 కోట్లు, కోకోకు రూ.14 కోట్లు, కాఫీకి కిలోకు రూ.50 చొప్పున కేటాయించినట్లు పేర్కొన్నారు. గత ప్రభుత్వం 40 లక్షల మెట్రిక్ టన్నులు కొంటె.. తమ ప్రభుత్వం 53.50 లక్షల మెట్రిక్ టన్నుల ధాన్యం కొనుగోలు చేసిందన్నారు.
News October 31, 2025
శిర్డీలో వేమిరెడ్డి దంపతులు

నెల్లూరు ఎంపీ వేమిరెడ్డి ప్రభాకర్రెడ్డి, కోవూరు ఎమ్మెల్యే వేమిరెడ్డి ప్రశాంతిరెడ్డి దంపతులు శిర్డీకి వెళ్లారు. బాబాను శుక్రవారం దర్శించుకున్నారు. సాయినాథుడిని దర్శించుకోవడం సంతోషంగా ఉందని తెలిపారు.
News October 31, 2025
కండలేరుకు నిధులు ఇవ్వాలని వినతి

కండలేరులో 11 కిలోమీటర్ల మేర కట్ట నిర్మించి 30 ఏళ్లు అవుతోంది. దీన్ని పటిష్ఠం చేయాల్సిన అవసరం ఎంతైనా ఉందని బీజేపీ నమామి గంగే రాష్ట్ర కన్వీనర్ మిడతల రమేశ్ తెలిపారు. డ్యాం సాధారణ మెయింటెనెన్స్కు నిధులు కేటాయించేలా చర్యలు తీసుకోవాలని ఆయన కోరారు. ఈ మేరకు రాజ్యసభ ఎంపీ బీద మస్తాన్ రావుకు ఆయన వినతిపత్రం అంందజేశారు.


