News March 29, 2024
ముండ్లమూరు: రెండు బైకులు ఢీ.. స్పాట్ డెడ్

రెండు బైకులు ఢీకొన్న ప్రమాదంలో ఒకరు మృతి చెందిన ఘటన శుక్రవారం వేంపాడు-పెద్ద రావిపాడులో జరిగింది. వేంపాడుకు చెందిన గోపనబోయిన రామారావు(40) తన మిర్చి పొలంలోని కూలీలకు టిఫిన్ తీసుకుని బైకుపై ముండ్లమూరు నుంచి వస్తున్నారు. అదే సమయంలో రావిపాడుకు చెందిన ఉలవ మల్లికార్జున తన బైకుపై వస్తూ మలుపు వద్ద ఇరువురు ఢీకొన్నారు. రామారావు చనిపోగా, మల్లికార్జున గాయపడ్డారు. పోలీసులు ఘటనాస్థలిని పరిశీలించారు.
Similar News
News February 9, 2026
175 నియోజకవర్గాల ర్యాంకింగ్.. ప్రకాశం లాస్ట్.!

APలోని 175 నియోజకవర్గాలకు ప్రభుత్వం వివిధ అంశాల ప్రాతిపదికన ర్యాంకులు కేటాయించింది. ఇందులో ప్రకాశం జిల్లాలోని ఒంగోలు(77), కందుకూరు(78), కొండపి(79) మార్కులతో రాష్ట్రంలోనే చివరి స్థానానికి పడిపోయాయి. మొత్తంగా 21 నియోజకవర్గాలకు A-ప్లస్, 153 నియోజకవర్గాలకు A-గ్రేడ్ లభించగా, ఒక నియోజకవర్గం B-గ్రేడ్లో నిలిచింది. 13 నియోజకవర్గాలు 90% పైగా స్కోరు సాధించాయి.
News February 9, 2026
ప్రకాశం SP స్పందనకు 124 ఫిర్యాదులు

ఒంగోలులోని ఎస్పీ కార్యాలయంలో సోమవారం నిర్వహించిన ఎస్పీ మీకోసం కార్యక్రమానికి 124 ఫిర్యాదులు అందినట్లు ఎస్పీ కార్యాలయం ఓ ప్రకటన విడుదల చేసింది. ఎస్పీ హర్షవర్ధన్ రాజు ఆదేశాల మేరకు.. పోలీసు ఉన్నతాధికారులు ఈ కార్యక్రమంలో పాల్గొని ఫిర్యాదుదారుల సమస్యలను అడిగి తెలుసుకున్నారు. అనంతరం సంబంధిత పోలీస్ స్టేషన్ అధికారులు వెంటనే ఫిర్యాదులను పరిష్కరించేలా చర్యలు తీసుకోవాలని ఆదేశించారు.
News February 9, 2026
ప్రకాశం: ACB దాడులు.. రెడ్ హ్యాండెడ్గా చిక్కిన అధికారి

ప్రకాశం జిల్లా కొత్తపట్నం మండలం కే.పల్లిపాలెం పంచాయతీ డెవలప్మెంట్ ఆఫీసర్ సంపత్ కుమార్ లంచం తీసుకుంటూ ACBకి రెడ్ హ్యాండెడ్గా చిక్కాడు. సోమవారం ఆయన రూ.55 వేలు డిమాండ్ చేసి తీసుకుంటుండగా అధికారులు దాడిచేసి పట్టుకున్నారు. అనంతరం సంపత్ కుమార్ను ఏసీబీ అధికారులు అదుపులోకి తీసుకున్నారు. గతంలో పలు ఆరోపణలు ఉన్న నేపథ్యంలో ఓ వ్యక్తి నుంచి నగదు తీసుకుంటూ పట్టుబడ్డాడు.


