News May 11, 2024
ముంబైలోని ఓ వీధికి శ్రీదేవి పేరు

దివంగత నటి శ్రీదేవికి మరో అరుదైన గౌరవం దక్కింది. ముంబైలోని ఓ వీధికి ఆమె పేరు పెట్టారు. లోఖండ్వాలా కాంప్లెక్స్లోని ఒక జంక్షన్కు అక్కడి ప్రజలు శ్రీదేవీ కపూర్ చౌక్గా నామకరణం చేశారు. ఈ విషయాన్ని ముంబై మునిసిపల్ కార్పొరేషన్ తెలిపింది. కాగా గతంలో ఇదే ప్రాంతంలోని గ్రీన్ ఎకర్స్ టవర్లో శ్రీదేవి కుటుంబం నివసించడంతోనే స్థానికులు ఆమె పేరు పెట్టారు.
Similar News
News February 27, 2026
కాంగ్రెస్ నిరసనలకే పరిమితమైంది: పీఎం మోదీ

1984 నుంచి కాంగ్రెస్ ప్రజల విశ్వాసాన్ని కోల్పోతూ వస్తోందని.. ఇప్పుడు నిరసనలకే పరిమితమైందన్నారు పీఎం మోదీ. ఆర్టికల్ 370 రద్దు, CAA, ట్రిపుల్ తలాక్ రద్దు, UPI, స్వచ్ఛభారత్, కరోనా వ్యాక్సిన్.. ఇలా సంస్కరణలు అన్నింటినీ వ్యతిరేకించిందన్నారు. ప్రతిపక్షం అంటే విమర్శలే కాదని, ప్రత్యామ్నాయ విజన్ చూపాలని హితవు పలికారు. కాంగ్రెస్కు మిలీనియల్స్ బుద్ధి చెప్పారని.. ఇప్పుడు జెన్జీలు సిద్ధంగా ఉన్నారన్నారు.
News February 27, 2026
సునీల్ నాయక్ ఘటన.. బిహార్ హోంశాఖ కీలక నిర్ణయం

బిహార్ హోంశాఖ కీలక నిర్ణయం తీసుకుంది. రాష్ట్ర క్యాడర్ పోలీసులపై చర్యలు తీసుకోవాలంటే ప్రభుత్వ అనుమతి తప్పనిసరి చేస్తూ ఉత్తర్వులు జారీ చేసింది. ఇటీవల IPS సునీల్ నాయక్ ఘటనతో ఈ నిర్ణయం తీసుకుంది. ఇప్పటికే <<19220184>>పట్నా కోర్టు<<>> IG స్థాయి అధికారిపై AP పోలీసుల తీరు పట్ల ఆగ్రహం వ్యక్తం చేసింది. బిహార్ పోలీసులకు సమాచారం ఇవ్వకుండా అరెస్ట్ వారెంట్/కేస్ డైరీ వెంట లేకుండా సునీల్ను అరెస్ట్ చేయడాన్ని తప్పుపట్టింది.
News February 27, 2026
రింకూ సింగ్.. తండ్రి చనిపోయిన బాధలోనూ..

T20WC: యంగ్ క్రికెటర్ రింకూ సింగ్ రేపు కోల్కతాలో భారత జట్టులో చేరుతారని బీసీసీఐ వెల్లడించింది. మార్చి 1న టీమ్ ఇండియా ఈడెన్ గార్డెన్స్లో వెస్టిండీస్తో తలపడనుంది. కాగా ఇవాళ తండ్రి మరణంతో <<19254408>>రింకూ<<>> సింగ్ అలీగఢ్ (యూపీ) వెళ్లిన సంగతి తెలిసిందే. తండ్రి <<19250311>>మరణించిన<<>> మరుసటి రోజే రింకూ దేశం కోసం ఆడేందుకు సిద్ధం కావడంపై నెటిజన్లు ప్రశంసిస్తున్నారు.


