News March 18, 2025

ముక్కలుగా నరికి మూట కట్టారు

image

అనకాపల్లి జిల్లా కశింకోట మండలం బయ్యవరంలో మహిళను ముక్కలుగా నరికి మూట కట్టేసి పడేశారు. దారుణంగా శరీర భాగాలు కట్ చేసి పడి ఉండడంతో స్థానికులు భయాందోళన చెందారు. దుప్పట్లో నడుము కింది భాగం, ఒక చేయి, కాళ్లు ఉన్నట్లు పోలీసులు గుర్తించారు. మృతురాలి వయసు సుమారు 40 సంవత్సరాలు ఉంటుందని పోలీసులు పేర్కొన్నారు. ఘటనా స్థలంలో క్లూస్ టీం ఆధారాలు సేకరిస్తున్నారు. మరిన్ని వివరాలు తెలియాల్సి ఉంది.

Similar News

News September 19, 2025

దసరా స్పెషల్ బస్సుల్లో ఛార్జీలు పెంపు!

image

TG: దసరా <<17751389>>స్పెషల్ బస్సుల్లో<<>> సవరించిన ఛార్జీలు అమల్లో ఉంటాయని RTC ప్రకటించింది. దీంతో టికెట్ ధర 50% పెరిగే అవకాశం ఉంది. ఈ నెల 20, 27-30, అక్టోబర్ 1, 5, 6 తేదీల్లో నడిచే స్పెషల్ బస్సుల్లో ఈ సవరణ ఛార్జీలు అమల్లో ఉంటాయి. రెగ్యులర్ సర్వీసుల ఛార్జీల్లో మార్పు ఉండదని సంస్థ తెలిపింది. 2003లో ప్రభుత్వం జారీ చేసిన GO 16 ప్రకారం స్పెషల్ బస్సులకు ఛార్జీలు సవరిస్తున్నట్లు RTC గతంలో పలుమార్లు వివరణ ఇచ్చింది.

News September 19, 2025

వర్గల్: పుట్టింటికి వెళ్లిన భార్య కావడం లేదని భర్త సూసైడ్

image

భార్య కాపురానికి రావడం లేదని భర్త సూసైడ్ చేసుకున్న ఘటన వర్గల్ మండలం మాదారంలో జరిగింది. అంకనీ సాయికుమార్(36), శ్యామల దంపతులకు ఇద్దరు పిల్లలు. ఇరువురు తరచూ గొడవలు పడుతుండటంతో రెండేళ్ల క్రితం శ్యామల పుట్టింటికి వెళ్లింది. రెండు రోజుల క్రితం భార్యను ఇంటికి రమ్మని వెళ్లగా ఆమె నిరాకరించింది. దీంతో మనస్తాపం చెందిన సాయి బుధవారం రాత్రి ఇంట్లో ఉరేసుకున్నట్లు గౌరారం ఎస్సై కరుణాకర్ రెడ్డి తెలిపారు.

News September 19, 2025

శబరిమల యాత్రకు వెళ్లి..తిరుగొస్తుండగా ఒకరి మృతి

image

సంతమాగులూరు మండలంలోని ఫతేపురం గ్రామానికి చెందిన సాంబయ్య శబరిమల యాత్ర తిరుగు ప్రయాణంలో గుండెపోటుతో మృతి చెందాడు. ఈనెల 14న తన స్నేహితుడితో కలిసి శబరిమలకు వెళ్లాడు. స్వామివారి దర్శనం అనంతరం తిరిగి రైలులో స్వగ్రామం బయలుదేరాడు. తమిళనాడు రాష్ట్రంలో గుండెపోటు రావడంతో రైల్వే సిబ్బంది ఆస్పుత్రికి తరలించగా పరీక్షించిన వైద్యులు మృతిచెందినట్లు చెప్పారు. దీంతో పత్తేపురంలో విషాదఛాయలు అలుముకున్నాయి.