News March 18, 2025
ముక్కలుగా నరికి మూట కట్టారు

అనకాపల్లి జిల్లా కశింకోట మండలం బయ్యవరంలో మహిళను ముక్కలుగా నరికి మూట కట్టేసి పడేశారు. దారుణంగా శరీర భాగాలు కట్ చేసి పడి ఉండడంతో స్థానికులు భయాందోళన చెందారు. దుప్పట్లో నడుము కింది భాగం, ఒక చేయి, కాళ్లు ఉన్నట్లు పోలీసులు గుర్తించారు. మృతురాలి వయసు సుమారు 40 సంవత్సరాలు ఉంటుందని పోలీసులు పేర్కొన్నారు. ఘటనా స్థలంలో క్లూస్ టీం ఆధారాలు సేకరిస్తున్నారు. మరిన్ని వివరాలు తెలియాల్సి ఉంది.
Similar News
News April 22, 2025
వనపర్తి: ఓపెన్ టెన్త్ పరీక్షలకు 42 మంది గైర్హాజరు

వనపర్తి బాలికల ఉన్నత పాఠశాలలో ఓపెన్ టెన్త్ పరీక్షలను ఏప్రిల్ 20 నుంచి ప్రారంభం కాగా 26వరకు జరగనున్నాయని అధికారులు చెబుతున్నారు. సోమవారం 349మంది విద్యార్థులు SSC పరీక్షలు రాయాల్సి ఉండగా 307మంది విద్యార్థులు రాశారని, 42మంది గైర్హాజరు అయ్యారని ఓపెన్ SSC, INTER స్కూల్స్ జిల్లా కోఆర్డినేటర్ రవీందర్ రెడ్డి తెలిపారు. ఓపెన్ ఇంటర్ పరీక్ష 491మంది రాయల్సి ఉండగా 435 మంది రాశారని, 56 మంది గైర్హాజరయ్యారన్నారు.
News April 22, 2025
కడప: రోడ్డు ప్రమాదంలో యువకుడి మృతి

ఉమ్మడి కడప జిల్లాలోని కోడూరు శాంతినగర్ బ్రిడ్జి వద్ద బైకు అదుపుతప్పి డివైడర్ ఢీకొనడంతో చియ్యవరం పంచాయతీ నడింపల్లికు చెందిన చరణ్ (28) తీవ్రంగా గాయపడ్డాడు. స్థానికులు వెంటనే ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. పరిస్థితి విషమించడంతో తిరుపతిలోని ప్రైవేట్ ఆసుపత్రికి తరలించారు. చికిత్స పొందుతూ మృతి చెందినట్లు ఎస్సై నవీన్ బాబు తెలిపారు. ఈ మేరకు కేసు నమోదు చేసి విచారిస్తున్నట్లు తెలిపారు.
News April 22, 2025
BREAKING: మహేశ్ బాబుకు ఈడీ నోటీసులు

హీరో మహేశ్ బాబుకు ED నోటీసులు పంపింది. రియల్ ఎస్టేట్ సంస్థలు సురానా గ్రూప్, సాయి సూర్య డెవలపర్స్ వ్యవహారంలో ఈ నెల 27న విచారణకు హాజరుకావాలంది. ఈ కంపెనీలు ఒకే భూమిని వివిధ వ్యక్తులకు అమ్మి మోసం చేసినట్లు ఇటీవల ED సోదాల్లో తేలింది. ఈ సంస్థలకు ప్రమోషన్ చేసినందుకు మహేశ్ బాబు రూ.3.4 కోట్లు తీసుకున్నట్లు గుర్తించింది. పెట్టుబడులు పెట్టేందుకు సామాన్యులను ఇన్ఫ్లుయెన్స్ చేశారని ఆయనపై అభియోగం మోపింది.