News March 30, 2025
ముక్తేశ్వర స్వామి ఆలయంలో పంచాంగ శ్రవణం

కాళేశ్వర ముక్తేశ్వర స్వామి దేవస్థానంలో ఉగాది సందర్భంగా ప్రత్యేక కార్యక్రమాలు నిర్వహించనున్నారు. ఈ నేపథ్యంలో ఆదివారం సాయంత్రం 5.30 గంటలకు పంచాంగ శ్రవణం కార్యక్రమం జరగనున్నట్లు దేవస్థాన కార్యనిర్వాహక అధికారి మహేశ్ తెలిపారు. భక్తులందరూ ఈ కార్యక్రమంలో పాల్గొని తీర్థ ప్రసాదాలు స్వీకరించాలని ఆయన కోరారు.
Similar News
News October 29, 2025
పునరావాస కేంద్రాన్ని సందర్శించిన జిల్లా ఎస్పీ

ఏలూరు ఎస్పీ ప్రతాప్ శివ కిషోర్ కైకలూరులోని భైరవపట్నం పునరావాస కేంద్రాన్ని సందర్శించారు. పోలీస్, రెవెన్యూ, ఇతర శాఖల సమన్వయంతో జిల్లాలో ప్రాణ నష్టం లేకుండా కాపాడగలిగామని ఆయన తెలిపారు. ముందస్తు జాగ్రత్తలతో ప్రమాదాలు జరగలేదని, సుమారు 3,000 మందిని సురక్షిత ప్రాంతాలకు తరలించామని ఎస్పీ వివరించారు.
News October 29, 2025
కంట్రోల్ రూమ్ ఏర్పాటు: జనగామ కలెక్టర్

జిల్లాలో కొనసాగుతున్న వర్షాల నేపథ్యంలో అత్యవసర పరిస్థితులు ఎదురైనా వెంటనే స్పందించేందుకు కలెక్టరేట్లో కంట్రోల్ రూమ్ 24/7 పని చేస్తుందని కలెక్టర్ షేక్ రిజ్వాన్ బాషా తెలిపారు. భారీ వర్షాల వల్ల వరదలు, ఇళ్లకు నష్టం, రహదారులు ధ్వంసం, చెట్లు కూలిపోవడం వంటి విపత్కర పరిస్థితులు ఎదురైతే వెంటనే కంట్రోల్ రూమ్కు 90523 08621 సమాచారం అందించాలాన్నారు.
News October 29, 2025
తుఫాన్ నష్టంపై వేగంగా అంచనాలు: లోకేశ్

AP: ‘మొంథా’ ప్రభావంతో జరిగిన నష్టంపై వేగంగా ప్రాథమిక అంచనాలు రూపొందించాలని మంత్రి లోకేశ్ అధికారులను ఆదేశించారు. కోనసీమ, కృష్ణా, బాపట్ల, ఎన్టీఆర్, ప్రకాశం జిల్లాల్లో విద్యుత్ స్తంభాలు విరిగి, చెట్లు కూలి కరెంటు నిలిచిపోయిందని చెప్పారు. విద్యుత్ సరఫరా జరిగేలా చర్యలు చేపట్టాలని తెలిపారు. క్షేత్రస్థాయిలో పార్టీ ప్రజాప్రతినిధులు, నాయకులు అందుబాటులో ఉండి బాధితులకు సహాయాన్ని అందించాలని సూచించారు.


