News July 10, 2024
ముఖ్యమంత్రి చంద్రబాబును కలిసిన ఎమ్మెల్యే చదలవాడ

అభివృద్ధిలో నియోజకవర్గాన్ని అగ్రస్థానంలో నిలపాలని కసితో పరుగులు పెడుతున్నానని, ప్రభుత్వం తరఫున తోడ్పాటు అందించాలని ముఖ్యమంత్రి చంద్రబాబుని నరసరావుపేట ఎమ్మల్యే చదలవాడ అరవిందబాబు విన్నవించారు. ఈ మేరకు వెలగపూడి సచివాలయంలో ముఖ్యమంత్రిని కలిశారు. రాష్ట్రంలో నరసరావుపేట నియోజకవర్గం ప్రత్యేక గుర్తింపు తీసుకొస్తానని ఆయన తెలిపారు.
Similar News
News November 3, 2025
GNT: పత్తి రైతులకు కలెక్టర్ సూచన

రైతులు CM యాప్లో నమోదు కావాలని జిల్లా కలెక్టర్ ఏ.తమీమ్ అన్సారియా సూచించారు. వ్యవసాయ మార్కెటింగ్ శాఖ రూపొందించిన పోస్టర్ను సోమవారం కలెక్టర్ ఆవిష్కరించారు. సీసీఐ ద్వారా క్వింటాలుకు రూ.8110 మద్దతు ధర ఉందన్నారు. ప్రత్తి కొనుగోలుకు నోటిఫైడ్ చేసిన జిన్నింగ్ మిల్లులలో రైతులు విక్రయించవచ్చన్నారు. CM యాప్లో (CM APP) నమోదు చేసుకుని, జిన్నింగ్ మిల్లు, విక్రయ తేదీ ఎంపిక చేసుకోవచ్చని చెప్పారు.
News November 3, 2025
ANU: వ్యాయామ విద్య పరీక్ష ఫీజు షెడ్యూల్ విడుదల

ఆచార్య నాగార్జున యూనివర్సిటీ పరీక్షల విభాగం ఆధ్వర్యంలో ఈ ఏడాది డిసెంబర్ ఒకటి నుంMR ప్రారంభం కానున్న బీపీఈడీ, డీపీఈడీ, ఎంపీఈడీ వ్యాయామ విద్య పరీక్షల ఫీజు షెడ్యూల్ విడుదల చేసినట్లు పరీక్షల నిర్వహణ అధికారి ఆలపాటి శివప్రసాదరావు సోమవారం సాయంత్రం తెలిపారు. పరీక్ష ఫీజు, తదితర వివరాలను యూనివర్సిటీ వెబ్సైట్ www.anu.ac.in నుంచి పొందవచ్చని చెప్పారు.
News November 3, 2025
ప్రతీగ్రామం స్వచ్ఛతకు నిలయం కావాలి: కలెక్టర్

ప్రతి గ్రామం స్వచ్ఛతకు నిలయం కావాలని కలెక్టర్ ఏ.తమీమ్ అన్సారియా అన్నారు. కలెక్టరేట్లో సోమవారం నీరు, పారిశుద్ధ్య కమిటీ సమావేశం సమావేశం జరిగింది. పారిశుద్ద్య నిర్వహణకు పెద్ద పీట వేయాలని, ఎక్కడా బహిరంగ మల విసర్జన లేకుండా చూడాలని కలెక్టర్ అన్నారు. బహిరంగ మల విసర్జన రహిత (ఓ.డి.ఎఫ్) గ్రామాలుగా గతంలో ప్రకటించిన గ్రామాల్లో తనిఖీలు నిర్వహించి పరిస్థితులను గమనించాలన్నారు.


