News October 30, 2024
ముఖ్యమంత్రి చంద్రబాబు నేటి షెడ్యూల్ ఇదే

సీఎం చంద్రబాబు 11.50 గంటలకు సచివాలయానికి చేరుకుంటారు. దీపం-2 పథకంలో భాగంగా మూడు గ్యాస్ సిలిండర్లు ఉచితంగా ఇచ్చే కార్యక్రమం ప్రారంభించడానికి అవసరమైన రూ.876 కోట్ల చెక్ను గ్యాస్ సరఫరా చేసే పెట్రోలియం సంస్థలకు అందజేయనున్నట్లు తెలిపారు. 12 గంటలకు స్వర్ణాంధ్ర విజన్ డాక్యుమెంట్పై నీతి ఆయోగ్ సంస్థ ప్రతినిధులతో చర్చించనున్నట్లు సీఎం క్యాంప్ కార్యాలయం తెలిపింది.
Similar News
News October 28, 2025
గుంటూరు: 92 కేంద్రాలకు 6 వేల మంది తరలింపు

మొంథా తుపాను నేపథ్యంలో జిల్లాలో సహాయక చర్యలు ముమ్మరం చేశారు. జిల్లా వ్యాప్తంగా 92 పునరావాస కేంద్రాలకు వరద ప్రభావిత ప్రాంతాల నుంచి దాదాపు 6 వేల మంది నిర్వాసితులను తరలించారు. కేంద్రాల్లో వారికి తాగునీరు, ఆహారం, చిన్న పిల్లలకు పాలు, బిస్కెట్లు అందిస్తున్నారు. కలెక్టర్ తమీమ్ అన్సారియా నేతృత్వంలో యంత్రాంగం సేవలు అందిస్తోంది.
News October 28, 2025
అవసరమైతే సహాయ చర్యలు చేపట్టండి: లోకేశ్

మొంథా తుఫాను తీవ్రతను సచివాలయంలోని ఆర్టీజీఎస్ కేంద్రం నుంచి మంత్రి నారా లోకేశ్ మంగళవారం సమీక్షించారు. హోంమంత్రి వంగలపూడి అనిత, ఉన్నతాధికారులు పాల్గొన్నారు. తుఫాను పరిస్థితులను నిరంతరం అంచనా వేయాలని, ఎలాంటి అత్యవసర పరిస్థితులకైనా సిద్ధంగా ఉండాలని అధికారులను మంత్రి ఆదేశించారు. కూటమినేతలు, కార్యకర్తలు ప్రజలకు అవసరమైన సహాయ చర్యలు చేపట్టాలని కోరారు.
News October 28, 2025
గుంటూరు జిల్లాలో ప్రారంభమైన ముంతా తుపాన్ ఎఫెక్ట్

గుంటూరు జిల్లాలో మొంథా తుపాన్ ప్రభావం ప్రారంభమైంది. తెనాలి, గుంటూరు, మంగళగిరి, కొల్లిపర మండలాల్లో గాలివానలు ముప్పు రేపుతున్నాయి. భారీ గాలి వేగంతో చెట్లు ఊగిపోతుండగా, కొన్ని చోట్ల గాలితో కూడిన వర్షం పడుతుంది. అధికారులు అప్రమత్తంగా ఉండాలని హెచ్చరికలు జారీ చేశారు. ప్రజలు బయటకు వెళ్లకుండా జాగ్రత్తలు పాటించాలని సూచనలు జారీ అయ్యాయి.


