News December 19, 2024
ముఖ్యమంత్రి పర్యటనకు పకడ్బందీ ఏర్పాట్లు: కలెక్టర్
ముఖ్యమంత్రి చంద్రబాబు శుక్రవారం కంకిపాడు, పెనమలూరు మండలాల్లో పర్యటించనున్న నేపథ్యంలో పకడ్బందీ ఏర్పాట్లు చేసినట్లు కలెక్టర్ డీకే బాలాజీ తెలిపారు. గురువారం ఆయన జాయింట్ కలెక్టర్ గీతాంజలి శర్మ, జిల్లా ఎస్పీ ఆర్. గంగాధరరావు, స్థానిక ఎమ్మెల్యె బోడే ప్రసాద్ గంగూర్లో హెలిపాడ్, రైతు సేవా కేంద్రం, శ్రీ వెంకటాద్రి రైస్ మిల్, ఈడుపుగల్లు గ్రామంలోని ఏర్పాట్లను పరిశీలించారు.
Similar News
News January 23, 2025
జిల్లాను పునరుత్పాదక ఇంధన హబ్గా తీర్చిదిద్దుదాం: కలెక్టర్
ఎన్టీఆర్ జిల్లాను పునరుత్పాదక ఇంధన హబ్గా తీర్చిదిద్దే బృహత్తర కార్యక్రమంలో ప్రతిఒక్కరూ భాగస్వాములు కావాలని కలెక్టర్ లక్ష్మీశ పిలుపునిచ్చారు. విద్యుత్ శాఖ, ఆధ్వర్యంలో ఎనికేపాడులో జరిగిన పీఎం సూర్యఘర్ ముఫ్త్ బిజిలీ యోజన జనజాగృతి ర్యాలీలో కలెక్టర్ పాల్గొన్నారు. సూర్యఘర్ పథకం ద్వారా స్థానిక నివాసి ఆర్. వీర రాఘవయ్య ఏర్పాటు చేసుకున్న సోలార్ ప్యానెల్ను పరిశీలించారు.
News January 23, 2025
విజయవాడ పోలీసులకు చంద్రబాబు అభినందనలు
విజయవాడ పోలీసు చర్యలను సీఎం చంద్రబాబు అభినందించారు. Suraksha For Safer Neighbourhoods చొరవ అభినందనీయమని కొనియాడారు. వెయ్యికంటే ఎక్కువ సీసీ కెమెరాలతో పర్యవేక్షణ ప్రాముఖ్యత చాటుతోందని చెప్పారు. ఈ తరహా పోలీసింగ్ పరిపాలన ప్రజలకు మెరుగైన సేవ చేస్తుందని సీఎం చంద్రబాబు తెలిపారు. హైటెక్ ఈగల్ వెహికల్స్ ప్రారంభించడం కూడా ఆయన అభినందించారు.
News January 23, 2025
VJA: బాలికపై అత్యాచారం.. పదేళ్ల జైలు శిక్ష
అత్యాచారం చేసిన వ్యక్తికి పదేళ్ల జైలుశిక్ష విధిస్తూ HYDలోని ప్రత్యేక పోక్సో కోర్టు తీర్పునిచ్చింది. పీపీ వివరాల మేరకు మియాపూర్కు చెందిన బాలిక(16)కు రమేష్ పరిచయమయ్యాడు. దీంతో ఆమెను విజయవాడ తీసుకెళ్లి పెళ్లి చేసుకున్నాడు. అనంతరం గదిలో బంధించి అత్యాచారం చేసి ఇంటి వద్ద వదిలి వెళ్లిపోయాడు. దీంతో కుటుంబ సభ్యులు పోలీసులకు ఫిర్యాదు చేయగా కేసు నమోదు చేసి.. చార్జీషీటు వేయగా కోర్టు తీర్పునిచ్చింది.