News April 10, 2025

ముఖ్యమంత్రి పర్యటన ఏర్పాట్లపై కలెక్టర్ సమీక్ష

image

ఈనెల 11న ఆగిరిపల్లిలో సీఎం చంద్రబాబు పర్యటన నేపథ్యంలో నూజివీడులోని సబ్ కలెక్టర్ కార్యాలయ సమావేశ మందిరంలో బుధవారం రాత్రి ఏలూరు జిల్లా కలెక్టర్ కె. వెట్రిసెల్వి సీఎం పర్యటన ఏర్పాట్లపై సమీక్ష సమావేశాన్ని నిర్వహించారు.  కలెక్టర్ మాట్లాడుతూ అన్ని శాఖల అధికారులంతా సమన్వయంతో పనిచేసి సీఎం పర్యటనను విజయవంతం చేయాలన్నారు. జేసీ ధాత్రి రెడ్డి, ఎస్పీ కెపీఎస్ కిషోర్  పాల్గొన్నారు.

Similar News

News December 9, 2025

2,569 పోస్టులు.. దరఖాస్తుకు రేపే ఆఖరు తేదీ

image

RRBలో 2,569 జూనియర్ ఇంజినీర్ పోస్టులకు అప్లై చేయడానికి రేపే ఆఖరు తేదీ. ఇప్పటివరకు అప్లై చేసుకోనివారు చేసుకోవచ్చు. DEC 12వరకు ఫీజు చెల్లించవచ్చు. పోస్టును బట్టి సంబంధిత విభాగంలో డిప్లొమా, B.Sc ఉత్తీర్ణులై, 18- 33 ఏళ్ల మధ్య ఉండాలి. రిజర్వేషన్ గలవారికి ఏజ్‌లో సడలింపు ఉంది. నెలకు జీతం రూ.35,400 చెల్లిస్తారు. www.rrbcdg.gov.in *మరిన్ని ఉద్యోగ నోటిఫికేషన్ల కోసం <<-se_10012>>జాబ్స్ <<>>కేటగిరీకి వెళ్లండి.

News December 9, 2025

పార్వతీపురం: మంత్రి చుట్టూ రోజుకో వివాదం.. పూటకో రగడ

image

మంత్రి సంధ్యారాణి చుట్టూ రోజుకో వివాదం నడుస్తోంది. ఇటీవల పచ్చకామెర్లతో గురుకుల పాఠశాల విద్యార్థులు మృతి చెందడంతో మంత్రిపై తీవ్ర విమర్శలు వచ్చాయి. మంత్రి PA వేధిస్తున్నాడని సాలూరుకు చెందిన మహిళ పోలీసులుకి ఫిర్యాదు చేయడం కలకలం సృష్టించింది. తాజాగా తన తల్లి <<18505977>>మరణానికి<<>> మంత్రి అనుచరుడి వేధింపులే కారణమని ఓ మహిళ కలెక్టర్‌కి ఫిర్యాదు చేసింది. మంత్రి అనుచరుల వల్ల ఆమెకు చెడ్డపేరు వస్తోందని లోకల్ టాక్.

News December 9, 2025

తిరుపతి: అర్చకుల మధ్య వివాదం.. అందుకోసమేనా.?

image

తిరుచానూరు పద్మావతి అమ్మవారి ఆలయంలో అర్చకుల మధ్య <<18509949>>కోల్డ్‌వార్<<>> కాకరేపుతోంది. ఆలయంలో కొత్తగా నాలుగు పరిచారకుల పోస్టుల భర్తీ కానున్నాయి. వీటిని దక్కించుకోవాలని కొందరు ప్రయత్నం చేస్తున్నట్లు సమాచారం. అనాధికారిక వ్యక్తులను పరిచారికులుగా చేర్చేందుకు కొందరు ప్రయత్నిస్తున్నారట. మరి విజిలెన్స్ అధికారులు దీనిపై విచారణ చేశారా.. లేదా అన్నది తేలాల్సి ఉంది.