News April 19, 2024
ముఖ్య మంత్రులను అందించిన డోన్ గడ్డ

డోన్ రాష్ట్ర రాజకీయాల కేంద్ర బిందువుగా ఉన్న డోన్ గడ్డ ఇద్దరు ముఖ్యమంత్రులను అందించింది. 1952 సంవత్సరంలో డోన్ అసెంబ్లీ నుంచి కాంగ్రెస్ అభ్యర్థిగా నీల సంజీవ రెడ్డి గెలుపొంది, ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రిగా డోన్ నుంచి ఎన్నికైన నీల సంజీవరెడ్డి పనిచేశారు. అలాగే 1994 అసెంబ్లీ ఎన్నికల్లో సీఎం హోదాలో డోన్ నుంచి కోట్ల విజయభాస్కర్ రెడ్డి పోటీ చేసి గెలుపొందారు. ప్రస్తుత ఆర్థిక మంత్రి బుగ్గన డోన్ ఎమ్మెల్యే
Similar News
News December 17, 2025
కర్నూలు ఎస్పీ హెచ్చరిక

జిల్లాలో ప్రజల భద్రత, శాంతిభద్రతల పరిరక్షణకు ‘విజిబుల్ పోలీసింగ్’ను బలోపేతం చేయాలని ఎస్పీ విక్రాంత్ పాటిల్ పోలీసులను ఆదేశించారు. కార్యక్రమంలో భాగంగా వాహనాల తనిఖీలు, సైబర్ నేరాలపై అవగాహన, రహదారి భద్రత నియమాల అమలు చేపడుతున్నారు. మైనర్ డ్రైవింగ్, డ్రంకెన్ డ్రైవింగ్, సెల్ఫోన్ డ్రైవింగ్పై కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. ప్రజలు సమస్యలు ఎదురైతే డయల్ 112 లేదా 100కు సమాచారం ఇవ్వాలన్నారు.
News December 16, 2025
క్రీడల అభివృద్ధికి కృషి చేస్తాం: ఏపీఐఐసీ డైరెక్టర్

రాష్ట్రంలో క్రీడల అభివృద్ధి పట్ల ప్రభుత్వం చిత్తశుద్ధితో కృషి చేస్తోందని APIIC డైరెక్టర్ దోమా జగదీశ్ గుప్తా అన్నారు. మంగళవారం కర్నూలులోని సిల్వర్ జూబ్లీ కళాశాల మైదానంలో కర్నూలు జిల్లా నెట్ బాల్ సంఘం ఆధ్వర్యంలో నిర్వహించిన జిల్లా నెట్ బాల్ సీనియర్ క్రీడాకారుల ఎంపిక పోటీలను జిల్లా అధ్యక్షుడు నాగేశ్వర బాబుతో కలిసి ప్రారంభించారు. నగరాన్ని స్పోర్ట్స్ సిటీగా తీర్చేందుకు మంత్రి కృషి చేస్తున్నారన్నారు.
News December 16, 2025
కర్నూలు పోలీస్ స్పందనకు 108 ఫిర్యాదులు

ఉద్యోగాల పేరుతో మోసపోవద్దని కర్నూలు జిల్లా ఎస్పీ విక్రాంత్ పార్టీలు తెలిపారు. కర్నూల్ టూ టౌన్ పక్కన పీజీఆర్ఎస్ కార్యక్రమాన్ని నిర్వహించారు. జిల్లా ప్రజల వినతులను స్వీకరించారు. PGRSకు సోమవారం 108 ఫిర్యాదులు వచ్చాయన్నారు. ఉద్యోగాల పేరుతో మోసాలు, గల్లంతైన వ్యక్తులు, సైబర్ నేరాలు, కుటుంబ వేధింపులు, ఆస్తి వివాదాలు వంటి పలు సమస్యలపై ఫిర్యాదులు వచ్చాయని ఎస్పీ తెలిపారు. వాటిని త్వరగా పరిష్కరించాలన్నారు.


