News December 19, 2024
ముగింపు దశకు చేరుకుంటున్న కొండగట్టు గిరి ప్రదక్షిణ మార్గం పనులు

శ్రీ కొండగట్టు ఆంజనేయస్వామి ఆలయంలో గిరి ప్రదక్షిణ ఏర్పాట్లలో భాగంగా కొండ చుట్టూ చదును చేయడానికి ఆలయం వద్ద గతనెల 27న చొప్పదండి ఎమ్మెల్యే మేడిపల్లి సత్యం భూమి పూజ చేసి పనులను ప్రారంభించారు. ఈ దారి నిర్మాణం దాదాపుగా పూర్తి దశకు చేరుకుంది.10 రోజుల్లోనే 2 కి.మీలు కొండచుట్టూ భక్తులు నడిచేందుకు వీలుగా దారి చేశారు. దారి నిర్మాణానికి మంత్రి పొన్నం ప్రభాకర్ సొంతంగా రూ.2 లక్షలు అందజేసిన విషయం తెలిసిందే.
Similar News
News December 3, 2025
గన్నేరువరం: ‘క్రీడల్లోనూ బాలికలు ముందుండాలి’

బాలికలు చదువుతో పాటు క్రీడల్లోనూ ముందుండి, అత్యుత్తమ ప్రతిభ కనబరచాలని అదనపు కలెక్టర్ అశ్విని తానాజీ వాకడే పేర్కొన్నారు. స్నేహిత అవగాహన కార్యక్రమంలో భాగంగా మంగళవారం తిమ్మాపూర్ కేజీబీవీ, గన్నేరువరం పాఠశాలలను ఆమె సందర్శించారు. అన్ని రంగాల్లోనూ ప్రతిభ చూపాలని బాలికలకు సూచించారు. ఏదైనా ఇబ్బంది ఉంటే వెంటనే హెల్ప్లైన్ నెంబర్లకు కాల్ చేయాలని కోరారు.
News December 3, 2025
KNR: సమస్యాత్మక పోలింగ్ కేంద్రాలను పరిశీలించిన సీపీ

డిసెంబర్ 14న జరగనున్న సర్పంచ్, వార్డు సభ్యుల ఎన్నికల నేపథ్యంలో తిమ్మాపూర్, మానకొండూర్, శంకరపట్నం, చిగురుమామిడి, గన్నేరువరం మండలాలలో పోలింగ్ కేంద్రాన్ని కరీంనగర్ సీపీ గౌస్ ఆలం సందర్శించారు. ప్రశాంత వాతావరణంలో నిష్పక్షపాతంగా ఎన్నికలు నిర్వహించేందుకు అన్ని చర్యలు తీసుకుంటామని, ప్రజలు పోలీసులకు సహకరించాలని, ఓటర్లు నిర్భయంగా ఓటు హక్కు వినియోగించుకోవాలని సీపీ విజ్ఞప్తి చేశారు.
News December 3, 2025
KNR: ‘ఎన్నికల పనుల్లో అప్రమత్తంగా ఉండాలి’

గ్రామ పంచాయతీ ఎన్నికల నోడల్ అధికారులు వారికి కేటాయించిన విధుల పట్ల అప్రమత్తంగా ఉండాలని అదనపు కలెక్టర్ అశ్విని తానాజీ వాకడే అన్నారు. కలెక్టరేట్ కాన్ఫరెన్స్ హాల్లో మంగళవారం నోడల్ అధికారులతో సమావేశం నిర్వహించారు. ఇప్పటివరకు తీసుకున్న చర్యలు, పోలింగ్ వరకు తీసుకోవాల్సిన చర్యలపై ఆమె సమీక్షించారు. ఎన్నికలను పారదర్శకంగా, సజావుగా నిర్వహించాలని, ఎలాంటి పొరపాట్లకూ తావివ్వకూడదని ఆమె ఆదేశించారు.


