News July 29, 2024

ముగిసిన ఉపాధ్యాయ పదోన్నతుల ప్రక్రియ

image

జిల్లాలో ఉపాధ్యాయ పదోన్నతుల ప్రక్రియ రెండో విడత కూడా ముగిసింది. గత నెల 20 వరకు ఉపాధ్యాయ బదిలీలు, పదోన్నతుల ప్రక్రియను పూర్తిచేసిన విషయం తెలిసిందే. అప్పట్లో ఒక్కో ఉపాధ్యాయుడు మూడు సబ్జెక్టుల్లో కూడా పదోన్నతులు పొంది ఒక్క సబ్జెక్టులోనే జాయిన్ కావడంతో మిగతా రెండు పోస్టులు ఖాళీగానే మిగిలిపోయాయి. దీంతో అధికారులు నాట్ విల్లింగ్ తో మిగిలిన పోస్టులను పదోన్నతుల ద్వారా భర్తీ చేశారు.

Similar News

News November 26, 2025

మునుగోడు: పత్తి మిల్లులో అనుమానాస్పదంగా కార్మికుడు మృతి

image

మునుగోడు మండలం కొంపల్లిలోని జై బిందు పత్తి కొనుగోలు కేంద్రంలో మహారాష్ట్రకు చెందిన కార్మికుడు ముస్తఫా జాఫర్ సాఫ్ జలాలు (30) మంగళవారం అనుమానాస్పదంగా మృతి చెందాడు. తహశీల్దార్ నరేష్, చండూరు సీఐ ఆదిరెడ్డి ఘటనా స్థలానికి చేరుకొని పరిశీలించారు. అనుమానం ఉన్న శార్దూల్‌ను అదుపులోకి తీసుకొని విచారిస్తున్నట్లు సీఐ ఆదిరెడ్డి తెలిపారు.

News November 26, 2025

నల్గొండ: చనిపోతూ ముగ్గురికి లైఫ్ ఇచ్చారు

image

చండూరుకు చెందిన రైతు పాలకూరి రామస్వామి (75) బైక్ ప్రమాదంలో బ్రెయిన్ డెడ్ అయ్యారు. ఆయన కుటుంబ సభ్యుల అంగీకారంతో మూడు నిండు జీవితాల్లో వెలుగులు నింపేందుకు అవయవదానం చేశారు. మానవతా విలువలకు నిలువెత్తు నిదర్శనంగా నిలిచిన ఆ కుటుంబ సభ్యులకు వీసీ సజ్జనార్ అభినందనలు తెలిపారు. అవయవదానం-మహాదానం అని ఆయన పేర్కొన్నారు.

News November 26, 2025

నల్గొండ: సర్పంచ్ ఎలక్షన్స్.. ఏ డివిజన్‌లో ఎప్పుడంటే..

image

రాష్ట్ర ప్రభుత్వం సర్పంచ్ ఎన్నికలకు నోటిఫికేషన్ విడుదల చేసిన విషయం తెలిసిందే. నల్గొండ జిల్లా వ్యాప్తంగా మూడు విడతల్లో ఎన్నికలు జరగనున్నాయి. చండూరు డివిజన్ పరిధిలో 14 మండలాలు ఉండగా వీటికి మొదటి విడత డిసెంబర్ 11న , మిర్యాలగూడ డివిజన్ పరిధిలో పది మండలాలు ఉండగా రెండో విడత డిసెంబర్ 14న, దేవరకొండ డివిజన్ పరిధిలో తొమ్మిది మండలాల్లో మూడో విడత డిసెంబర్ 17న ఎన్నికలు నిర్వహించనున్నారు.