News February 23, 2025
ముగిసిన ఎపీపీఎస్సీ గ్రూప్-2 మెయిన్స్ పరీక్షలు

ఆదివారం జరిగిన ఎపీపీఎస్సీ గ్రూప్ 2 మెయిన్స్ పరీక్షలను ప్రశాంత వాతావరణంలో నిర్వహించినట్లు జిల్లా కలెక్టర్ డా.వెంకటేశ్వర్ ఎస్ తెలిపారు. తిరుపతిలో నిర్వహించిన 13 పరీక్షా కేంద్రాలలో ఈ పరీక్షలకు 5801 మంది అభ్యర్థులు పరీక్షలు రాయాల్సి ఉండగా ఉదయం పేపర్ 1 పరీక్షకు 5055 మంది హాజరు కాగా 87.14 శాతంగా, మధ్యాహ్నం పేపర్-2 పరీక్షకు 5046 మంది హాజరు కాగా 86.99 శాతం మంది పరీక్షకు హాజరయ్యారని తెలిపారు.
Similar News
News October 20, 2025
నరసాపురంలో కూతురిపై తండ్రి అత్యాచారం

నరసాపురంలో దారుణ ఘటన వెలుగు చూసింది. ఎస్ఐ విజయలక్ష్మి వివరాల మేరకు.. పట్టణానికి చెందిన ఓ మహిళ ఉపాధి నిమిత్తం గల్ఫ్ వెళ్లింది. కుమార్తె(13) 9వ తరగతి చదువుతోంది. భర్త మద్యానికి బానిసయ్యాడు. జులైలో కుమార్తె(13)పై మద్యం మత్తులో తండ్రి అత్యాచారానికి పాల్పడ్డాడు. ఈ విషయాన్ని ఎవరికైనా చెప్తే చంపేస్తానని బెదిరించాడు. ఇటీవల తల్లి గల్ఫ్ నుంచి వచ్చింది. విషయం తెలుసుకుని పోలీసులకు ఆదివారం ఫిర్యాదు చేసింది.
News October 20, 2025
జనగామ: కడుపు నింపుతున్న అమ్మలు.. గిట్టుబాటు కాక అప్పులు

ప్రభుత్వ పాఠశాలల్లో మధ్యాహ్నం భోజనం వండి పెడుతున్న వంట ఏజెన్సీ మహిళలు విద్యార్థులను తమ కన్నబిడ్డల్లా భావించి కడుపు నింపుతున్నారు. బిల్లులు రాకున్నా అప్పులు తెచ్చి మరీ కడుపునిండా వండి పెడుతున్నారు. జిల్లాలోని పాఠశాలల్లో 910 మంది వంట చేసే మహిళలు ఉన్నారు. ప్రభుత్వం నుంచి వచ్చే బిల్లులకు అయ్యే ఖర్చులు ఎక్కువ అవుతున్నాయి. వారికి చెల్లించే గౌరవ వేతనం ఏమాత్రం సరిపోక కడుపులు మాడ్చుకుంటున్నారు.
News October 20, 2025
విశాఖ-చర్లపల్లి మధ్య స్పెషల్ రైలు

దీపావళి పండుగ నేపథ్యంలో ప్రయాణికులు రద్దీనీ దృష్టిలో ఉంచుకొని ఈస్ట్ కోస్ట్ రైల్వే ప్రత్యేక రైలు నడపనుంది.అక్టోబర్21న సాయంత్రం 5.30 గంటలకు విశాఖ నుండి చర్లపల్లి(08541)మధ్య ప్రత్యేక రైలు బయల్దేరి,అక్టోబర్22ఉదయం 8గంటలకు చేరుతుంది.అలాగే అక్టోబర్ 22న మధ్యాహ్నం 3.30 గంటలకు చర్లపల్లి -విశాఖ(08542)మధ్య ప్రత్యేక రైలు బయల్దేరి, అక్టోబర్23న ఉదయం7 గంటలకు విశాఖపట్నం చేరుతుందని విశాఖ రైల్వే అధికారులు తెలిపారు.