News February 23, 2025

ముగిసిన ఎపీపీఎస్సీ గ్రూప్‌-2 మెయిన్స్ పరీక్షలు

image

ఆదివారం జరిగిన ఎపీపీఎస్సీ గ్రూప్ 2 మెయిన్స్ పరీక్షలను ప్రశాంత వాతావరణంలో నిర్వహించినట్లు జిల్లా కలెక్టర్ డా.వెంకటేశ్వర్ ఎస్ తెలిపారు. తిరుపతిలో నిర్వహించిన 13 పరీక్షా కేంద్రాలలో ఈ పరీక్షలకు 5801 మంది అభ్యర్థులు పరీక్షలు రాయాల్సి ఉండగా ఉదయం పేపర్ 1 పరీక్షకు 5055 మంది హాజరు కాగా 87.14 శాతంగా, మధ్యాహ్నం పేపర్‌-2 పరీక్షకు 5046 మంది హాజరు కాగా 86.99 శాతం మంది పరీక్షకు హాజరయ్యారని తెలిపారు.

Similar News

News February 27, 2026

ఆరుట్ల మోడల్.. 100 తెలంగాణ పబ్లిక్ స్కూల్స్!

image

TG: రంగారెడ్డి(D) ఆరుట్ల స్కూల్ తరహాలో 100 నియోజకవర్గాల్లో తెలంగాణ పబ్లిక్ స్కూల్స్(TPS) ప్రారంభించాలని CM రేవంత్ అధికారులను ఆదేశించారు. క్లాస్ రూములు, గ్రౌండ్, ట్రాన్స్‌పోర్ట్, టీచింగ్ స్టాఫ్ వంటి సకల వసతులు ఉండేలా చూడాలన్నారు. ఇక HYDలో 12 ఇంటిగ్రేటెడ్ స్కూళ్లను ఏడాదిలోగా పూర్తి చేయాలని సూచించారు. నాణ్యమైన విద్య కోసం ఎంత ఖర్చుకైనా వెనకాడబోమని స్పష్టం చేశారు.

News February 27, 2026

గంగా జలం ఇంటికి తెచ్చుకుంటున్నారా?

image

గంగా జలం ఇంట్లో ఉంటే చాలా మంచిది. అయితే పుణ్య క్షేత్రాల నుంచి ఆ జలాన్ని తెచ్చేటప్పుడు చాలామంది ప్లాస్టిక్ బాటిళ్లు వాడుతుంటారు. దాని బదులు ఇత్తడి పాత్రలు వాడితే ఆ జలంలోని ఆధ్యాత్మిక శక్తి పెరుగుతుందని పండితులు చెబుతున్నారు. ‘గంగా జలం వాస్తు దోషాలను, ప్రతికూల శక్తులను పోగొడుతుంది. గ్రహణాల తర్వాత, శుభకార్యాలప్పుడు ఇంటిని శుద్ధి చేయడానికి దీనిని ప్రోక్షించడం వల్ల సానుకూలత పెరుగుతుంది’ అంటున్నారు.

News February 27, 2026

“చద్దిలేని పయనం, ఒంటి ఎద్దు సేద్యం”

image

పూర్వం కాలినడకన, ఎడ్లబండ్ల మీద ప్రయాణాలు చేసేవారు. అప్పట్లో హోటల్స్ ఉండేవి కావు. అప్పుడు తిండి లేకుండా చాలా దూరం ప్రయాణించాల్సి వస్తే ఆకలితో అలమటించి నీరసించిపోయేవారు. అలాగే వ్యవసాయానికి జత ఎడ్లు ఉండాలి. ఒక ఎద్దు కట్టి పొలం దున్నడం అసాధ్యం. ఒకవేళ చేసినా అది కష్టంగా మారుతుంది. అందుకే ఏదైనా పనిని ప్రారంభించేటప్పుడు సరైన ప్రణాళిక, వనరులు, అవసరమైన సాయం లేకపోతే అది విజయవంతం కాదని ఈ సామెత చెబుతుంది.