News May 3, 2024
ముగిసిన ఓపెన్ టెన్త్, ఇంటర్ పరీక్షలు: డీఈఓ

గత నెల 25 నుంచి ప్రారంభమైన ఓపెన్ పదో తరగతి, ఇంటర్మీడియట్ పరీక్షలు గురువారంతో ముగిశాయి. భద్రాద్రి జిల్లాలో పదో తరగతి అభ్యర్థులకు మూడు సెంటర్లు, ఇంటర్ అభ్యర్థులకు నాలుగు పరీక్ష కేంద్రాలు ఏర్పాటు చేయగా, పరీక్షలు ప్రశాంతంగా జరిగాయి. ఓపెన్ ఇంటర్మీడియట్ జనరల్, ఒకేషనల్ ప్రాక్టికల్ పరీక్షలు నేటి నుంచి 10వ తేదీ వరకు జరుగుతాయని డీఈఓ వెంకటేశ్వరచారి తెలిపారు.
Similar News
News October 15, 2025
కార్తిక సోమవారం.. పంచారామాలకు ప్రత్యేక బస్సు

ఖమ్మం: కార్తిక మాసాన్ని పురస్కరించుకుని భక్తుల సౌకర్యార్థం RTC ఖమ్మం విభాగం ప్రత్యేక సర్వీసును ప్రకటించింది. ఖమ్మం కొత్త బస్టాండ్ నుంచి అమరావతి, భీమవరం, ద్రాక్షారామం, పాలకొల్లు, సామర్లకోటకు సూపర్ లగ్జరీ బస్సు నడుపుతోంది. ఈ నెల 26న రాత్రి 8 గంటలకు బస్సు బయలుదేరుతుంది. టికెట్ ధర పెద్దలకు రూ.2,300, పిల్లలకు రూ.1,200గా నిర్ణయించామని, వివరాలకు 91364 46666 నెంబర్ను సంప్రదించాలని అధికారులు తెలిపారు.
News October 15, 2025
ఆ నాలుగు మండలాల్లోనే వర్షపాతం నమోదు.!

ఖమ్మం జిల్లా వ్యాప్తంగా బుధవారం ఉదయం 8:30 వరకు గడిచిన 24 గంటల్లో 9.6 మిల్లీమీటర్ల వర్షపాతం నమోదైందని వాతావరణ శాఖ వెల్లడించింది. కూసుమంచి మండలంలో 4.8, తల్లాడ మండలంలో 2.4, రఘునాథపాలెం మండలంలో 1.4, ఖమ్మం రూరల్ మండలంలో 1.0 మిల్లీమీటర్లు నమోదైనట్లు చెప్పారు. కాగా ఇతర మండలాల్లో ఎలాంటి వర్షపాతం నమోదు కాలేదని పేర్కొన్నారు.
News October 15, 2025
ఖమ్మం: 82 మంది పోలీసులకు సేవా పతకాలు ప్రదానం

ఖమ్మం కమిషనరేట్ పరిధిలో విశిష్ట సేవలందించిన 82 మంది పోలీస్ సిబ్బందికి రాష్ట్ర ప్రభుత్వం ప్రకటించిన సేవా పతకాలను కమిషనర్ సునీల్ దత్ మంగళవారం అందజేశారు. మహోన్నత సేవ పతకం ఒకటి, ఉత్తమ సేవ ఐదు, సేవా పతకాలు 64, ఉత్కృష్ట పతకాలు 12 మందికి లభించాయి. అడిషనల్ డీసీపీ ప్రసాద్ రావు, ఏసీపీలు రమణమూర్తి, సాంబరాజు తదితరులు పతకాలు అందుకున్నారు.