News February 26, 2025
ముగిసిన జాతీయ సాంకేతిక సదస్సు

పాణ్యం మండలంలోని రాజీవ్ గాంధీ మెమోరియల్ ఇంజినీరింగ్ కళాశాలలో సమ్యక్ 2కే25 రిప్పుల్ జాతీయ సాంకేతిక సదస్సు మంగళవారం ముగిసింది. అర్జీఎం కళాశాలలో రెండు రోజులుగా విద్యార్థులతో కలిసి ఈ సదస్సును నిర్వహించినట్లు సదస్సు కన్వీనర్ డాక్టర్ సోఫియా ప్రియదర్శిని పేర్కొన్నారు. సాంకేతికత నైపుణ్యం పెంచుకోవడానికి చేపట్టాల్సిన చర్యలపై విద్యార్థులకు అవగాహన కల్పించామని వారు వెల్లడించారు.
Similar News
News October 24, 2025
జగిత్యాల: PSలలో విద్యార్థులు..!

పోలీస్ అమరవీరుల సంస్మరణ(Police Flag Day) వారోత్సవాల సందర్భంగా జిల్లాలో వివిధ పోలీస్ స్టేషన్లలో విద్యార్థులకు ఓపెన్ హౌస్ కార్యక్రమం నిర్వహించారు. జిల్లా ఎస్పీ అశోక్ కుమార్ ఆదేశాల మేరకు జరిగిన కార్యక్రమంలో విద్యార్థులకు PSల పనితీరు, డయల్ 100 సేవలు, FIR నమోదు విధానం, సీసీ కెమెరాల ఉపయోగం, డ్రంక్ అండ్ డ్రైవ్ తనిఖీ, ఫ్రెండ్లీ పోలీసింగ్, భరోసా సెంటర్ సేవలు, షీ టీంల వ్యవస్థ తదితర వాటిపై అవగాహన కల్పించారు.
News October 24, 2025
జగిత్యాల: వివాహిత ఆత్మహత్య.. భర్తకు 10ఏళ్ల జైలు

జగిత్యాల జిల్లా బీరపూర్ మండలం మంగేళకి చెందిన లహరి అలియాస్ ప్రియాంకను సారంగాపూర్ మండలం కోనాపూర్కి చెందిన రాజేందర్కు ఇచ్చి వివాహం చేశారు. ఈ క్రమంలో అదనపు వరకట్నం కోసం భర్త రాజేందర్ లహరిని వేధించడంచో ఆమె ఆత్మహత్యకు పాల్పడింది. నిందితుడు భర్తపై కేసు నమోదు చేసి రిమాండ్కు తరలించారు. విచారణ జరిపిన న్యాయమూర్తి నారాయణ గురువారం నిందితుడికి 10 ఏళ్ల జైలు శిక్ష, రూ.10వేల జరిమానా విధిస్తూ తీర్పునిచ్చారు.
News October 24, 2025
సిరిసిల్ల: ‘ప్రతి పేద మహిళ సంఘాల్లో చేరాలి’

జిల్లాలోని ప్రతి పేద మహిళ స్వయం సహాయక సంఘాల్లో సభ్యురాలిగా ఉండాలని సెర్ప్ సీఈవో దివ్యా దేవరాజన్ కోరారు. జిల్లాలోని సెర్ప్ డీపీఎంలు, ఏపీఎంలు, సీసీలతో జిల్లా సమీకృత కార్యాలయాల సముదాయంలో గురువారం ఆమె సమీక్ష సమావేశం నిర్వహించారు. ముఖ్యఅతిథులుగా దివ్యా దేవరాజనతో పాటు జిల్లా ఇన్ఛార్జ్ కలెక్టర్ గరీమా అగ్రవాల్ పాల్గొన్నారు.