News February 26, 2025
ముగిసిన జాతీయ సాంకేతిక సదస్సు

పాణ్యం మండలంలోని రాజీవ్ గాంధీ మెమోరియల్ ఇంజినీరింగ్ కళాశాలలో సమ్యక్ 2కే25 రిప్పుల్ జాతీయ సాంకేతిక సదస్సు మంగళవారం ముగిసింది. అర్జీఎం కళాశాలలో రెండు రోజులుగా విద్యార్థులతో కలిసి ఈ సదస్సును నిర్వహించినట్లు సదస్సు కన్వీనర్ డాక్టర్ సోఫియా ప్రియదర్శిని పేర్కొన్నారు. సాంకేతికత నైపుణ్యం పెంచుకోవడానికి చేపట్టాల్సిన చర్యలపై విద్యార్థులకు అవగాహన కల్పించామని వారు వెల్లడించారు.
Similar News
News November 27, 2025
PDPL: ‘పంచాయతీ ఎన్నికలు కట్టుదిట్టంగా నిర్వహించాలి’

పంచాయతీ ఎన్నికలను నిబంధనలకు అనుగుణంగా కట్టుదిట్టంగా నిర్వహించాలని కలెక్టర్ కోయ శ్రీ హర్ష ఆదేశించారు. తొలి విడతలో 99 పంచాయతీలకు ఎన్నికలు జరగనున్నాయి. నోటిఫికేషన్ నవంబర్ 27న విడుదల అవుతుంది. 27–29న నామినేషన్లు స్వీకరణ, 30న పరిశీలన, డిసెంబర్ 1న అప్పీలు, 2న పరిష్కారం, 3న ఉపసంహరణ. నామినేషన్ కేంద్రాల్లో 100 మీ. భద్రతా పరిమితి, టి-పోల్లో డేటా నమోదు తప్పనిసరి అని కలెక్టర్ తెలిపారు.
News November 27, 2025
పెగడపల్లి: సీఐటీయూ రాష్ట్ర ఉపాధ్యక్షురాలిగా రజిత

సీఐటీయూ రాష్ట్ర ఉపాధ్యక్షురాలిగా జగిత్యాల జిల్లా మల్యాల మండలం తక్కల్లపల్లి అంగన్వాడీ టీచర్ A.రజిత ఎన్నికయ్యారు బుధవారం ఆదిలాబాద్లో జరిగిన రాష్ట్ర ఐదవ మహాసభలో రజితను రాష్ట్ర ఉపాధ్యక్షురాలుగా ఏకగ్రీవంగా ఎన్నుకున్నారు. అలాగే రాష్ట్ర కమిటీ సభ్యులుగా పలుగుల జయప్రద (పెగడపల్లి) G.స్వప్న (జగిత్యాల) ఏకగ్రీవంగా ఎన్నుకున్నారు. ఈ సందర్భంగా జిల్లాకు చెందిన అంగన్వాడీ టీచర్లు, ఆయాలు వారికి కృతజ్ఞతలు తెలిపారు.
News November 27, 2025
ఆ బంగ్లాను రబ్రీదేవి ఖాళీ చేయరు: RJD

RJD చీఫ్ లాలూ భార్య రబ్రీదేవి ఉంటున్న నివాసాన్ని ఆమె ఖాళీ చేయరని, ఏం చేసుకుంటారో చేసుకోండని ఆ పార్టీ బిహార్ చీఫ్ మంగానీ లాల్ మండల్ తెలిపారు. జీవితకాల నివాసం కింద ఆ బంగ్లాను కేటాయించినట్లు చెప్పారు. పట్నాలోని అన్నే మార్గ్లో CM నివాసం ఎదుట రబ్రీదేవి, లాలూ 2 దశాబ్దాలుగా ఉంటున్నారు. కాగా దాన్ని ఖాళీ చేసి హార్డింజ్ రోడ్ 39 బంగ్లాకు మారాలంటూ ఇటీవల నితీశ్ ప్రభుత్వం ఉత్తర్వులివ్వగా RJD స్పందించింది.


