News April 3, 2025

ముగిసిన పదిపరీక్షలు.. పిల్లలపై ఓ కన్నేసి ఉంచండి!

image

‘పది’ పరీక్షలు ముగిశాయి. దీంతో విద్యార్థులు ఫ్రీ బర్డ్స్ లాగా <<15971907>>తిరగాలని<<>> భావిస్తారు. కావున తల్లిదండ్రులు వారి కదలికలపై ఓ కన్నేసి ఉంచాలని నిపుణులు సూచిస్తున్నారు. పిల్లలకు మోటార్ బైకులు ఇవ్వొద్దు. స్నేహితులతో చెరువులకు వెళ్లకుండా చూడాలి. వారు ఈత నేర్చుకుంటానంటే తల్లిదండ్రుల పర్యవేక్షణలో నేర్చుకోవాలి. నిన్న యాదాద్రి(D)లో ఈతకు వెళ్లి ఇద్దరు బీటెక్ విద్యార్థులు మృతి చెందిన విషయం తెలిసిందే.

Similar News

News September 17, 2025

విశాఖలో జీసీసీ బిజినెస్ సమ్మిట్ ప్రారంభం

image

రుషికొండలోని రాడీసన్‌ బ్లూ హోటల్‌‌లో గ్లోబల్‌ కేపబులిటీ సెంటర్‌ బిజినెస్ సదస్సు ప్రారంభమయ్యింది. ఈ సదస్సులో ముఖ్య అతిథిగా సీఎం చంద్రబాబు హాజరయ్యారు. కేంద్ర ఆర్థిక శాఖ మంత్రి నిర్మలా సీతారామన్‌తో పాటు సిఐఐ ప్రతినిధులు హాజరయ్యారు.

News September 17, 2025

పల్నాడు జిల్లాలో 30.8 మి.మీ వర్షపాతం

image

పల్నాడు జిల్లాలో గత 24 గంటల్లో 30.8 మి.మీటర్ల సగటు వర్షపాతం నమోదైనట్లు వాతావరణ శాఖ అధికారులు తెలిపారు. జిల్లాలోని మొత్తం ఐదు మండలాల్లో వర్షం కురిసింది. ఇందులో అత్యధికంగా చిలకలూరిపేటలో 14.4 మి.మీ, నాదెండ్లలో 7.2, పిడుగురాళ్లలో 6.4, నూజెండ్లలో 1.6, ఈపూరులో 1.2 మి.మీ వర్షపాతం నమోదైంది. జిల్లాలో సగటున 1.1 మి.మీ వర్షపాతం నమోదైంది.

News September 17, 2025

జగిత్యాల: ‘మహిళల ఆరోగ్యం, కుటుంబ శక్తివంతం కోసం అభియాన్’

image

మహిళల ఆరోగ్యం బలోపేతం అయితేనే కుటుంబాలు శక్తివంతంగా ఉంటాయని ఎమ్మెల్యే సంజయ్ కుమార్ అన్నారు. జగిత్యాలలోని మాతా శిశు ఆసుపత్రిలో కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు ప్రతిష్ఠాత్మకంగా చేపట్టిన స్వస్థ నారి ససక్త పరివార్ అభియాన్ (హెల్తీ ఉమెన్ ఎంపవర్ ఫ్యామిలీ కాంపెయిన్)లో పాల్గొన్న సందర్భంగా ఆయన మాట్లాడారు. కార్యక్రమంలో భాగంగా పోషణ మాసం పోస్టర్ ఆవిష్కరణ చేశారు. ప్రతి ఒక్కరు రక్తదానం చేయాలని ప్రతిజ్ఞ చేయించారు.