News March 29, 2025

ముగిసిన శిథిలాల తొలగింపు

image

భద్రాచలంలోని ఐదంతస్తుల భవనం కూలిన ఘటనలో శిథిలాల తొలగింపు శుక్రవారం ముగిసింది. శిథిలాల కింద చిక్కుకున్న కామేశ్వరరావు, ఉపేందర్ మృతదేహలను బయటకు తీసి కుటుంబ సభ్యులకు అప్పగించారు. సుమారు 42గంటల పాటు సహాయక బృందాలు, అధికారులు శిధిలాల తొలగింపు ప్రక్రియలో పాల్గొన్నారు. ఈ ఘటనలో ఇంటి యజమాని శ్రీపతి దంపతులపై కేసు నమోదు చేసినట్లు సీఐ రమేష్ తెలిపారు.

Similar News

News November 25, 2025

పంజాబ్ & సింధ్ బ్యాంక్‌లో 30పోస్టులు.. అప్లైకి రేపే లాస్ట్ డేట్

image

<<-1>>పంజాబ్ <<>>& సింధ్ బ్యాంక్‌లో 30 MSME రిలేషన్‌షిప్ మేనేజర్స్ పోస్టులకు అప్లై చేయడానికి రేపే ఆఖరు తేదీ. డిగ్రీ, ఎంబీఏ అర్హతగల వారు అప్లై చేసుకోవచ్చు. అభ్యర్థుల గరిష్ఠ వయసు 33ఏళ్లు. రిజర్వేషన్ గలవారికి ఏజ్‌లో సడలింపు ఉంది. రాత పరీక్ష, స్క్రీనింగ్, పర్సనల్ ఇంటర్వ్యూ ద్వారా ఎంపిక చేస్తారు. దరఖాస్తు ఫీజు రూ.850, SC, ST, PWBDలకు రూ.100. వెబ్‌సైట్: https://punjabandsind.bank.in

News November 25, 2025

కోకో తోటల్లో కొమ్మ కత్తిరింపులు – లాభాలు

image

కోకో తోటల్లో రెండేళ్ల వరకు మొక్క సింగిల్ కొమ్మతో పెరిగేలా చూడాలి. పంట నాటిన మూడేళ్ల తర్వాత కొమ్మ కత్తిరింపులు తప్పనిసరిగా చేయాలి. మే 15 – జులై 15లోపు ప్రధాన కొమ్మలను కత్తిరించాలి. దీని వల్ల SEP,OCT,NOV నెలల్లో పూత బాగా వస్తుంది. నేలను చూసే కొమ్మలను, నేల నుంచి 3 అడుగుల వరకు కొమ్మలు లేకుండా కత్తిరించాలి. పదేళ్లు దాటిన తోటల్లో చెట్లు 7 అడుగులలోపే ఉండేలా చూడాలి. దీని వల్ల కాయ పెరుగుదల బాగుంటుంది.

News November 25, 2025

ప్రొద్దుటూరులో నేటి బంగారం ధరలు

image

ప్రొద్దుటూరు బులియన్ మార్కెట్లో నేడు మంగళవారం బంగారం వెండి ధరలు వివరాలు:
☛ బంగారం 24 క్యారెట్లు 1 గ్రాము: రూ.12590
☛ బంగారం 22 క్యారెట్లు 1 గ్రాము: రూ.11583
☛ వెండి 10 గ్రాములు రూ.1616
ప్రొద్దుటూరు బులియన్ మార్కెట్లో నేడు మంగళవారం బంగారం వెండి ధరలు వివరాలు: