News September 9, 2024

ముగ్గురు ఎస్సైలపై ఎస్పీ విద్యాసాగర్ వేటు

image

విధి నిర్వహణలో నిర్లక్ష్యంగా వ్యవహరించిన ముగ్గురు ఎస్ఐలపై ఎస్పీ విద్యాసాగర్ నాయుడు క్రమశిక్షణ చర్యలు తీసుకున్నారు. తంబళ్లపల్లి ఎస్ఐ లోకేశ్ రెడ్డి, ముదివేడి ఎస్ఐ దిలీప్ కుమార్, ములకలచెరువు ఎస్ఐ గాయత్రీపై ఆదివారం రాత్రి క్రమశిక్షణ చర్యలు తీసుకున్నట్లు చెప్పారు. రాజంపేట డీఎస్పీ ఆఫీసుకు లోకేశ్ రెడ్డి, రాయచోటికి గాయత్రి, పీలేరుకు దిలీప్ కుమార్‌లను అటాచ్ చేసినట్లు తెలిపారు.

Similar News

News November 17, 2025

చిత్తూరు పోలీసులకు అందిన 38 ఫిర్యాదులు

image

చిత్తూరు జిల్లా పోలీసు కార్యాలయంలో ఎస్పీ తుషార్ డూడీ సోమవారం ప్రజా సమస్యల పరిష్కార వేదిక కార్యక్రమం నిర్వహించారు. బాధితుల నుంచి వినతులు స్వీకరించారు. వివిధ సమస్యలపై 38 ఫిర్యాదులు అందినట్టు అధికారులు తెలిపారు. వీటిని చట్టప్రకారం విచారించి బాధితులకు సత్వర న్యాయం చేయాలని ఎస్పీ సిబ్బందిని ఆదేశించారు. కార్యక్రమంలో అడిషనల్ ఎస్పీ రాజశేఖర్ రాజు పాల్గొన్నారు.

News November 17, 2025

చిత్తూరు పోలీసులకు అందిన 38 ఫిర్యాదులు

image

చిత్తూరు జిల్లా పోలీసు కార్యాలయంలో ఎస్పీ తుషార్ డూడీ సోమవారం ప్రజా సమస్యల పరిష్కార వేదిక కార్యక్రమం నిర్వహించారు. బాధితుల నుంచి వినతులు స్వీకరించారు. వివిధ సమస్యలపై 38 ఫిర్యాదులు అందినట్టు అధికారులు తెలిపారు. వీటిని చట్టప్రకారం విచారించి బాధితులకు సత్వర న్యాయం చేయాలని ఎస్పీ సిబ్బందిని ఆదేశించారు. కార్యక్రమంలో అడిషనల్ ఎస్పీ రాజశేఖర్ రాజు పాల్గొన్నారు.

News November 17, 2025

చిత్తూరు కలెక్టరేట్ ఎదుట మహిళ ఆత్మహత్యాయత్నం

image

చిత్తూరు కలెక్టర్ కార్యాలయం ఎదుట ఓ మహిళ ఆత్మహత్యకు ప్రయత్నించింది. కార్యాలయాల చుట్టూ తిరిగిన తన భూ సమస్యకు పరిష్కారం దొరకలేదంటూ వి.కోట(M) మిట్టూరుకు చెందిన నందిని పురుగుల మందు తాగింది. అక్కడున్న మహిళా పోలీసులు వెంటనే స్పందించారు. ఆమెను ఆసుపత్రికి తరలించారు. మరిన్ని వివరాలు తెలియాల్సి ఉంది.