News April 1, 2025
ముగ్గుల పోటీల్లో రూ.2 లక్షల ప్రైజ్ మనీ సాధించిన యాజలి మహిళ

అమెరికా అసోసియేషన్ ఆధ్వర్యంలో USAలో ఆన్లైన్ విధానంలో సంక్రాంతి ముగ్గుల పోటీలు నిర్వహించారు. ఈ పోటీల్లో యాజలి గ్రామానికి చెందిన లుక్కా భార్గవి 5వ బహుమతి గెలుచుకొని రూ.2 లక్షలు ప్రైజ్ మనీ గెలుపొందారు. ఈ సందర్భంగా భార్గవిని యాజలి తెలుగుదేశం పార్టీ అధ్యక్షుడు దామర్ల సూర్యనారాయణ, వీర రాఘవయ్య తదితరులు అభినందించారు. ఈ ముగ్గుల పోటీలలో 30 వేల మంది పాల్గొన్నారు.
Similar News
News April 18, 2025
సమ్మర్లో తలనొప్పి రావొద్దంటే..

☞ తరచుగా తాగునీటిని తీసుకోవాలి. దాహం వేయకపోయినా తాగడం మంచిది
☞ బయటకు వెళ్లినప్పుడు సన్ గ్లాసెస్, టోపీ ధరించాలి
☞ 11am-4pm మధ్య నీడపట్టున ఉండాలి. అవసరమైతేనే బయటకు వెళ్లాలి
☞ పుచ్చకాయ, నారింజ, దోసకాయ వంటి నీటిశాతం ఎక్కువ ఉండే వాటిని ఆహారంగా తీసుకోవాలి
☞ స్క్రీన్ టైమ్ తగ్గించాలి
☞ సమయానికి భోజనం చేయాలి. బ్లడ్ షుగర్ లెవెల్స్ పడిపోవడం కూడా తలనొప్పికి దారితీస్తుంది
☞ 5-10min మెడిటేషన్ చేయాలి
News April 18, 2025
సిరిసిల్ల జిల్లాలో ఉష్ణోగ్రతల వివరాలు

రాజన్న సిరిసిల్ల జిల్లాలోని గడిచిన 24 గంటల్లో ఉష్ణోగ్రతలు ఇలా నమోదు అయ్యాయి. కొనరావుపేట 40.9 °c,చందుర్తి 40.8 °c,సిరిసిల్ల 40.8 °c,ఇల్లంతకుంట 40.7 °c,వీర్నపల్లి 40.5 °c,గంభీరావుపేట 40.3 °c,తంగళ్ళపల్లి 40.2°c, వేములవాడ రూరల్ 39.9°c, ఎల్లారెడ్డిపేట 39.8°c, బోయిన్పల్లి 39.8°c, ముస్తాబాద్ 38.9°c,లుగా నమోదు అయ్యాయి. 7 మండలాలకు వాతావరణ శాఖ ఆరెంజ్ జోన్ ప్రకటించింది.
News April 18, 2025
పోచంపల్లితో వినోబా భావేకు విడదీయని అనుబంధం

ఆచార్య వినోబా భావేకు <<16135013>>పోచంపల్లితో <<>>విడదీయని అనుబంధం ఉంది. మొదటిసారి 1951లో పోచంపల్లికి వచ్చారు. అలాగే 1956 జనవరి 30న గాంధీ వర్ధంతి సందర్భంగా రెండోసారి వచ్చారు. భూదానోద్యమానికి కార్యోన్ముఖునిగా నిలిచిన పోచంపల్లిని భూదాన గంగోత్రిగా అభివర్ణిస్తూ తన రెండో జన్మస్థలంగా వినోబా భావే పేర్కొనడం విశేషం. వినోబా భావే మరణాంతరం భారత ప్రభుత్వం ఆయన ఆవిశ్రాంత కృషికి గాను 1982లో ‘భారతరత్న’ బిరుదును ప్రకటించింది.