News May 26, 2024

ముచ్చింతల్: సమతా మూర్తిని దర్శించుకున్న మధ్యప్రదేశ్ సీఎం

image

మధ్యప్రదేశ్ ముఖ్యమంత్రి మోహన్ యాదవ్ శనివారం శంషాబాద్ మండల పరిధిలోని ముచ్చింతల్ శివారులోని సమతా మూర్తి కేంద్రాన్ని సందర్శించారు. 108 దివ్య ఆలయాలు, స్వర్ణ రామానుజులను కుటుంబ సమేతంగా దర్శించుకున్నారు. అనంతరం శ్రీ త్రిదండి చిన్న జీయర్ స్వామి ఆశీస్సులు తీసుకున్నారు. ఈ సందర్భంగా అక్కడి విశేషాలు గురించి వారికి సవివరంగా వివరించారు.

Similar News

News November 18, 2025

HYD: శబరిమల యాత్రికులకు ముఖ్య గమనిక

image

శబరిమల యాత్రకు శంషాబాద్ విమానాశ్రయం నుంచి బయలుదేరే అయ్యప్ప స్వాములకు కీలక సూచన. ఇకపై ఎయిర్‌పోర్ట్ అధికారులు క్యాబిన్ బ్యాగ్‌లో ఇరుముడు పెట్టుకోవడానికి అనుమతి ఇవ్వడం లేదు. యాత్రికులు ఇరుముడు తప్పనిసరిగా చెక్-ఇన్ లగేజ్‌లో మాత్రమే ఉంచాలి. చివరి నిమిషంలో అసౌకర్యం ఎదురుకాకుండా ముందస్తుగా ఈ సూచనలను పాటించాలని కొందరు స్వాములు Way2News ద్వారా ఇతర భక్తులకు తెలియజేస్తున్నారు.SHARE IT

News November 18, 2025

HYD: శబరిమల యాత్రికులకు ముఖ్య గమనిక

image

శబరిమల యాత్రకు శంషాబాద్ విమానాశ్రయం నుంచి బయలుదేరే అయ్యప్ప స్వాములకు కీలక సూచన. ఇకపై ఎయిర్‌పోర్ట్ అధికారులు క్యాబిన్ బ్యాగ్‌లో ఇరుముడు పెట్టుకోవడానికి అనుమతి ఇవ్వడం లేదు. యాత్రికులు ఇరుముడు తప్పనిసరిగా చెక్-ఇన్ లగేజ్‌లో మాత్రమే ఉంచాలి. చివరి నిమిషంలో అసౌకర్యం ఎదురుకాకుండా ముందస్తుగా ఈ సూచనలను పాటించాలని కొందరు స్వాములు Way2News ద్వారా ఇతర భక్తులకు తెలియజేస్తున్నారు.SHARE IT

News November 17, 2025

రంగారెడ్డి: కలెక్టర్ గారూ.. ప్రభుత్వ బోర్డు మాయమైంది!

image

రూ.కోట్లు విలువ చేసే ప్రభుత్వ భూములు అన్యాక్రాంతమవుతున్నా రెవెన్యూ అధికారులు నామమాత్రపు చర్యలతో అక్రమార్కుల దృష్టిలో అలుసైపోతున్నారని తెలంగాణ భూముల పరిరక్షణ సమితి ఉపాధ్యక్షుడు గంటిల వెంకటేశ్ ఆరోపించారు. మంచాల మం. ఆగపళ్లి గ్రామ పంచాయతీలోని సర్వే నం.191లో అధికారులు ఏర్పాటు చేసిన రక్షణ బోర్డు 2 రోజులకే మాయమైంది. అయినా అధికారులు పట్టించుకోవడం లేదని కలెక్టర్ సి.నారాయణరెడ్డికి సోమవారం ఫిర్యాదు చేశారు.