News December 16, 2024

ముత్తంగి అలంకరణలో దర్శనమిచ్చిన భద్రాద్రి రామయ్య

image

భద్రాచలం శ్రీ సీతారామచంద్రస్వామి దేవస్థానంలో సోమవారం స్వామివారు ముత్తంగి అలంకరణలో దర్శనమిచ్చారు. ముందుగా ఉ.4 గంటలకే అర్చకులు ఆలయ తలుపులు తెరిచి స్వామివారికి సుప్రభాత సేవ నిర్వహించారు. అనంతరం ఆరాధన, సేవాకాలం, నిత్య బలిహరణం, పవిత్ర గోదావరి జలంతో అభిషేకం తదితర నిత్య పూజా కార్యక్రమాలు యథావిధిగా జరిపారు. అనంతరం రామయ్య నిత్యకల్యాణాన్ని వైభవంగా నిర్వహించారు. భక్తులు అధిక సంఖ్యలో పాల్గొన్నారు.

Similar News

News January 19, 2025

బుగ్గపాడులో దంపతులు సూసైడ్.. ఆప్డేట్

image

సత్తుపల్లి మండలం బుగ్గపాడులో<<15185005>> కృష్ణ, సీత దంపతులు <<>>చెరువులోకి దూకి సూసైడ్ చేసుకున్న విషయం తెలిసిందే. కృష్ణారావు లారీ, ఆటో, డీసీఎం కొనగా అవి ప్రమాదాలు, మరమ్మతులకు గురవడంతో అమ్మేశాడు. ఈక్రమంలో ఇల్లు గడవక, ఆదాయ మార్గం లేక ఇబ్బందిపడ్డాడు. తండ్రి పరిస్థితిని చూసి కుమార్తెలు సాయపడేవారు. వారిని ఇబ్బంది పెట్టలేక కృష్ణారావు దంపతులిద్దరూ చనిపోవాలని నిర్ణయించుకుని.. రావి చెరువులోకి దూకి సూసైడ్ చేసుకున్నారు.

News January 19, 2025

ఖమ్మం ఖిల్లా వెయ్యేళ్ల చరిత్ర ఇదే..!

image

ఖమ్మం ఖిల్లాకు వెయ్యేళ్ల చరిత్ర ఉంది. క్రీ.శ 997లో గజపతులతో పాటు ఖమ్మం వచ్చిన కొండాపురానికి చెందిన అక్కిరెడ్డి, అస్కారెడ్డి కోట నిర్మాణం ప్రారంభించగా.. క్రీ.శ. 1006లో నిర్మాణం పూర్తయింది. 1531లో సుల్తాన్ కులీ కుత్బుల్ ముల్క్ అప్పటి ఖమ్మం పాలకుడైన సితాబ్ ఖాన్‌‌ను ఓడించి కోటను స్వాధీనపరుచుకున్నాడు. అప్పటి నుంచి ఈ ఖిల్లా కుతుబ్ షాహీల పాలనలోకి వెళ్లింది. 17వ శతాబ్దంలో ఆసఫ్ జాహీల ఆధీనంలోకి పోయింది.

News January 18, 2025

ఖమ్మంలో విషాదం.. చెరువులో దంపతుల మృతదేహాలు లభ్యం

image

ఖమ్మం జిల్లా సత్తుపల్లి మండలంలో విషాదం నెలకొంది. బుగ్గపాడు గ్రామానికి చెందిన కృష్ణ(60), సీత(55) దంపతులు అదే గ్రామంలోని రావి చెరువులో శవమై తేలడం స్థానికుల్లో ఆందోళన కలిగించింది. దంపతులు ఆర్థిక ఇబ్బందులతో చెరువులో దూకి ఆత్మహత్య చేసుకొని ఉంటారని కుటుంబ సభ్యులు అనుమానిస్తున్నారు. గ్రామస్థుల సమాచారం మేరకు పోలీసులు ఘటన స్థలానికి చేరుకొని మృతదేహాలను బయటకు తీసి దర్యాప్తు చేస్తున్నారు.